BJP: పాకిస్తాన్ కూడా చేయలేని ఆరోపణలను రాహుల్ గాంధీ దేశంపై చేస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP’s Fresh Attack on Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశం పరువును తీస్తున్నారని మండిపడుతోంది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). ప్రపంచ దేశాలు భారత్ ను పొగుడుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం విమర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేసేందుకు భయపడుతోంది, కానీ రాహుల్ గాంధీ మాత్రం విదేశీ గడ్డపై దేశంలో ప్రజాస్వామ్యం లేదని, న్యాయవ్యవస్థ, మీడియా ప్రమాదంలో ఉందని ఆరోపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు భారత దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా చూస్తున్న తరుణంలో ఇక్కడ వ్యాపారం చేసేందుకు చైనాను విడిచిపెడుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా నిరోధిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Influenza: కోవిడ్ తరహాలో ఫ్లూ.. ఇండియా వ్యాప్తంగా పెరిగిన కేసులు.. లక్షణాలు ఇవే..
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
భారతదేశాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు రాహుల్ గాంధీ ఏజెంట్ గా పనిచేస్తున్నారా..? అని ప్రశ్నిస్తుంచారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ.. భారత దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో పాటు పలువురు రాజకీయ నాయకులు నిఘాలో ఉన్నారని రాహుల్ ఆరోపించారు. మైనారిటీలను దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని.. ఆయన, గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేయడానికి ఎందాకైనా వెళ్తారని సంబిత్ పాత్ర ఆరోపించారు. రాహుల్ గాంధీ తన ప్రభ కోల్పోతున్నారని, అందుకే భారతదేశం గొప్పతనం అర్ధం కాదని అన్నారు.
పెగాసస్ మాల్వేర్ ద్వారా నిఘా పెడుతున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీకి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎందుకు మొబైల్స్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. చైనాలో ఎల్లో రివర్ జాతీయవాదానికి కారణం అయిందని చెబుతున్న రాహుల్ గాంధీకి, భారత్ లోని గంగా నదీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!