BJP: పాకిస్తాన్ కూడా చేయలేని ఆరోపణలను రాహుల్ గాంధీ దేశంపై చేస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP’s Fresh Attack on Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశం పరువును తీస్తున్నారని మండిపడుతోంది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). ప్రపంచ దేశాలు భారత్ ను పొగుడుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం విమర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేసేందుకు భయపడుతోంది, కానీ రాహుల్ గాంధీ మాత్రం విదేశీ గడ్డపై దేశంలో ప్రజాస్వామ్యం లేదని, న్యాయవ్యవస్థ, మీడియా ప్రమాదంలో ఉందని ఆరోపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు భారత దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా చూస్తున్న తరుణంలో ఇక్కడ వ్యాపారం చేసేందుకు చైనాను విడిచిపెడుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా నిరోధిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Influenza: కోవిడ్ తరహాలో ఫ్లూ.. ఇండియా వ్యాప్తంగా పెరిగిన కేసులు.. లక్షణాలు ఇవే..
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
భారతదేశాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు రాహుల్ గాంధీ ఏజెంట్ గా పనిచేస్తున్నారా..? అని ప్రశ్నిస్తుంచారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ.. భారత దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో పాటు పలువురు రాజకీయ నాయకులు నిఘాలో ఉన్నారని రాహుల్ ఆరోపించారు. మైనారిటీలను దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని.. ఆయన, గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేయడానికి ఎందాకైనా వెళ్తారని సంబిత్ పాత్ర ఆరోపించారు. రాహుల్ గాంధీ తన ప్రభ కోల్పోతున్నారని, అందుకే భారతదేశం గొప్పతనం అర్ధం కాదని అన్నారు.
పెగాసస్ మాల్వేర్ ద్వారా నిఘా పెడుతున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీకి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎందుకు మొబైల్స్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. చైనాలో ఎల్లో రివర్ జాతీయవాదానికి కారణం అయిందని చెబుతున్న రాహుల్ గాంధీకి, భారత్ లోని గంగా నదీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!