Lok Sabha polls: పంజాబ్లో బీజేపీ-అకాలీదళ్ పొత్తు.. ఎన్డీఏలో చేరికపై చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha polls: విడిపోయిన మిత్రులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఏన్డీయే కూటమి, అందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పాత మిత్రులను అక్కున చేర్చుకుంటోంది. ఇప్పటికే పాత మిత్రలైన తెలుగు దేశం పార్టీ, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలు ఏన్డీయేలోకి చేరాయి. అయితే, తాజాగా పంజాబ్కి చెందిన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) మధ్య పొత్తుపూ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్న అకాలీదల్, మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా కూటమి నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. ఆప్, కాంగ్రెస్ ధాటికి కీలక అకాలీదళ్ నేతలు పరాజయం పాలయ్యారు.
Read Also: Pallavi Prasanth : శివాజీకి గురుదక్షిణ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. అన్నా ఏంటి ఇలా ఝలక్ ఇచ్చావు..
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే, పంజాబ్లో రెండు పార్టీల మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి ఎస్ఎస్ చన్నీ తెలిపారు. చర్చలు జరుగుతున్నాయని, మార్చి 22న అకాలీదళ్ కోర్ కమిటీ సమావేశమవుతోందని, ఆ తర్వాత బీజేపీ, అకాలీదళ్ మధ్య సమావేశం జరుగుతుందని, పొత్తుపై తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు.
అకాలీదళ్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దల్జీత్ సింగ్ చమీ కూడా పొత్తును ధృవీకరించారు. చండీగఢ్లో జరగబోయే కోర్ కమిటీ సమావేశంలో పొత్తుతో పాటు పలు అంశాలపై చర్చిస్తామని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), సిక్కు ఖైదీల విడుదల వంటి అపరిష్కృత సమస్యల కారణంగా అకాలీదల్ బీజేపీతో పొత్తుతో వెనకడుగు వేస్తోంది. అకాలీదల్-బీజేపీ పొత్తుపై ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అకాలీదల్, రైతుల సమస్య, మతంపై దాని వైఖరికి హానికరం అని పేర్కొన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని 13 లోక్సభ స్థానలకు గానూ 8 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే, బీజేపీ, అకాలీదళ్ చెరో రెండు సీట్లు, ఆప్ ఒక్కసీటును కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!