Lok Sabha polls: పంజాబ్లో బీజేపీ-అకాలీదళ్ పొత్తు.. ఎన్డీఏలో చేరికపై చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha polls: విడిపోయిన మిత్రులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఏన్డీయే కూటమి, అందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పాత మిత్రులను అక్కున చేర్చుకుంటోంది. ఇప్పటికే పాత మిత్రలైన తెలుగు దేశం పార్టీ, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలు ఏన్డీయేలోకి చేరాయి. అయితే, తాజాగా పంజాబ్కి చెందిన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) మధ్య పొత్తుపూ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్న అకాలీదల్, మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా కూటమి నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. ఆప్, కాంగ్రెస్ ధాటికి కీలక అకాలీదళ్ నేతలు పరాజయం పాలయ్యారు.
Read Also: Pallavi Prasanth : శివాజీకి గురుదక్షిణ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. అన్నా ఏంటి ఇలా ఝలక్ ఇచ్చావు..
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
ఇదిలా ఉంటే, పంజాబ్లో రెండు పార్టీల మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి ఎస్ఎస్ చన్నీ తెలిపారు. చర్చలు జరుగుతున్నాయని, మార్చి 22న అకాలీదళ్ కోర్ కమిటీ సమావేశమవుతోందని, ఆ తర్వాత బీజేపీ, అకాలీదళ్ మధ్య సమావేశం జరుగుతుందని, పొత్తుపై తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు.
అకాలీదళ్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దల్జీత్ సింగ్ చమీ కూడా పొత్తును ధృవీకరించారు. చండీగఢ్లో జరగబోయే కోర్ కమిటీ సమావేశంలో పొత్తుతో పాటు పలు అంశాలపై చర్చిస్తామని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), సిక్కు ఖైదీల విడుదల వంటి అపరిష్కృత సమస్యల కారణంగా అకాలీదల్ బీజేపీతో పొత్తుతో వెనకడుగు వేస్తోంది. అకాలీదల్-బీజేపీ పొత్తుపై ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అకాలీదల్, రైతుల సమస్య, మతంపై దాని వైఖరికి హానికరం అని పేర్కొన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని 13 లోక్సభ స్థానలకు గానూ 8 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే, బీజేపీ, అకాలీదళ్ చెరో రెండు సీట్లు, ఆప్ ఒక్కసీటును కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!