Priyanka Gandhi: ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. శనివారం రాజస్థాన్ జైపూర్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఏర్పడిన కేంద్ర సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగాన్ని గరిష్టస్థాయికి చేర్చిందని విమర్శించారు.
Read Also: PM Modi: యుపి ర్యాలీలో “ఫ్లాప్ ఫిల్మ్” అంటూ వారి పై వ్యాఖ్యలు చేసిన పీఎం మోడీ..!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
జైపూర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ సమక్షంలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆమె జైపూర్లో జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడారు. ప్రజల ఆశల్ని వమ్ము చేసేందుకు బీజేపీ అగ్నివీర్ పథకాన్ని తీసుకువచ్చిందని, ప్రతీ రాష్ట్రంలో పేపర్ లీక్స్ అవుతున్నాయని, రైతులు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రధాని మోడీకి వినడానికి సిద్ధంగా లేరని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. మీరు వేయబోయే ఓట్లు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫఏస్టో దేశ ప్రజల గొంతుకగా ఆమె అభివర్ణించారు.
రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి ఎన్నిక కావడం సంతోషంగా, గర్వంగా ఉందని ఆమె అన్నారు. ‘న్యాయపాత్ర’ పేరుతో నిన్న కాంగ్రెస్ మేనిఫేస్టో విడుదల చేశామని ఆమె చెప్పారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాలకు మధ్య జరుగుతున్నాయని, ఒక వైపు దేశాన్ని, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తులు ఉంటే, మరోవైపు దేశాన్ని రక్షించే ఇండియా కూటమి ఉందని సచిన్ పైలెట్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశంలో 7 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!