Bharath Bandh: రెండవరోజు కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కేంద్ర ఉద్యోగ, కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు రెండు రోజుల “భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక అనేక డిమాండ్లు తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయడం. అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం సామాజిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం కోరుతోంది.
అంతేకాకుండా కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం. పెట్రోల్, డీజిల్పై పన్నుల తగ్గింపు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు. కాంట్రాక్టు కార్మికులు చేసే ఇలాంటి పనులకు సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, రాగి, బీమా వంటి రంగాల కార్మికులు, ఉద్యోగులు.
Also Read
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, బీహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా బంద్ ప్రభావం కనిపిస్తోంది. రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనకుండా తమ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది కేరళ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది కేరళ హైకోర్టు.
తమ ఉద్యోగులను సమ్మెలో పాల్గొనకుండా నిషేధించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఏ ఉద్యోగి అయినా పనికి హాజరుకాని పక్షంలో షో-కాజ్ నోటీసు జారీ చేయబడుతుందని పేర్కొంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. మార్చి 28, 29 రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మూడు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల ఉద్యోగులపై “మహారాష్ట్ర ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్”(మెస్మా)ప్రయోగించింది.
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయంతో ఈ చర్య తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. పశ్చిమ బెంగాల్, ఒడిశా తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సోమవారం ప్రజా రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్లపై నిలిచిపోయాయి బస్సులు, క్యాబ్లు. భువనేశ్వర్లో రైల్వే ట్రాక్లను అడ్డుకున్నారు లెఫ్ట్ ఫ్రంట్ మద్దతున్న కార్మిక సంఘాల కార్యకర్తలు.
తాజావార్తలు
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!