Matrimonial frauds: మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా పరిచయమ్యాడు.. నగలతో ఉడాయించాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimonial frauds: ఇటీవల కాలంలో మ్యాట్రిమోని వెబ్సైట్ మోసాలు పెరిగిపోయాయి. తల్లిదండ్రుల అత్యాశ ఈ మోసాలకు కారణం అవుతోంది. ప్యాకేజీ, ఉద్యోగం, బంగ్లాలు, కార్లను చూసి మోసపోతున్నారు. తప్పుడు సమాచారంతో ముఖ్యంగా మహిళలను మోసం చేస్తున్నారు. చివరకు పెళ్లైన తర్వాత అసలు విషయం తెలియడమో.. లేకపోతే మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి నగదు, బంగారాన్ని కొట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. మ్యాట్రిమోని సైట్ లో పరిచయం అయిన వ్యక్తి తనను మోసం చేశాడని బుధవారం బెంగళూర్ కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Kiccha Sudeep: బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకికాదు..
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
బెంగళూర్ కు చెంది ఓ మహిళను ఢిల్లీ వ్యక్తి మోసగించాడు. ఎయిర్ లైన్ ఉద్యోగి అయిన 39 ఏళ్ల బెంగళూర్ మహిళకు ఢిల్లీకి చెంది. వ్యక్తి అన్షుల్ జైన్ పేరుతో మాట్రిమోని వెబ్సైట్ ద్వారా పరిచయం అయ్యాడు. జైన్ తాను ఢిల్లీలో వ్యాపారవేత్తగా మహిళకు 15 రోజుల క్రితం పరిచయమ్యాడు. అయితే తన కుటుంబాన్ని ఓ వివాహ వేడుకల్లో పరిచయం చేస్తానని, ఢిల్లీకి రావాల్సిందిగా మహిళను కోరారు. అందుకు సదరు బాధిత మహిళ కూడా సరే అంది. అయితే వచ్చేటప్పుడు అందంగా కనిపించేందుకు మంచి దుస్తులు, బంగారు ఆభరణాలు తీసుకురావాలని కోరాడు. ఇవన్ని నమ్మిన మహిళ అన్షుల్ జైన్ చెప్పిన విధంగానే బెంగళూర్ నుంచి ఢిల్లీకి వెళ్లింది.
ఆదివారం తనను నిందితుడు ఢిల్లీ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకున్నాడని, ఏరోసిటీ ఫుడ్ కోర్టులో భోజనం చేసిన తర్వాత అక్కడ నుంచి కారులో బయలుదేరామని, అర కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత కారు టైర్ లో ఏదో తేడాగా ఉందని చెప్పి, టైర్లు తనిఖీ చేసేందుకు దిగిన వెంటనే నిందితుడు తన విలువైన వస్తువులతో పారిపోయాడని మహిళ ఆరోపించింది. తన వద్ద నుంచి 300 గ్రాముల ఆభరణాలు, రూ.15 వేల నగదు, మొబైల్ ఫోన్, మూడు ఏటీఎం కార్డులు, బ్యాగ్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!