Matrimonial frauds: మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా పరిచయమ్యాడు.. నగలతో ఉడాయించాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimonial frauds: ఇటీవల కాలంలో మ్యాట్రిమోని వెబ్సైట్ మోసాలు పెరిగిపోయాయి. తల్లిదండ్రుల అత్యాశ ఈ మోసాలకు కారణం అవుతోంది. ప్యాకేజీ, ఉద్యోగం, బంగ్లాలు, కార్లను చూసి మోసపోతున్నారు. తప్పుడు సమాచారంతో ముఖ్యంగా మహిళలను మోసం చేస్తున్నారు. చివరకు పెళ్లైన తర్వాత అసలు విషయం తెలియడమో.. లేకపోతే మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి నగదు, బంగారాన్ని కొట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. మ్యాట్రిమోని సైట్ లో పరిచయం అయిన వ్యక్తి తనను మోసం చేశాడని బుధవారం బెంగళూర్ కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Kiccha Sudeep: బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకికాదు..
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
బెంగళూర్ కు చెంది ఓ మహిళను ఢిల్లీ వ్యక్తి మోసగించాడు. ఎయిర్ లైన్ ఉద్యోగి అయిన 39 ఏళ్ల బెంగళూర్ మహిళకు ఢిల్లీకి చెంది. వ్యక్తి అన్షుల్ జైన్ పేరుతో మాట్రిమోని వెబ్సైట్ ద్వారా పరిచయం అయ్యాడు. జైన్ తాను ఢిల్లీలో వ్యాపారవేత్తగా మహిళకు 15 రోజుల క్రితం పరిచయమ్యాడు. అయితే తన కుటుంబాన్ని ఓ వివాహ వేడుకల్లో పరిచయం చేస్తానని, ఢిల్లీకి రావాల్సిందిగా మహిళను కోరారు. అందుకు సదరు బాధిత మహిళ కూడా సరే అంది. అయితే వచ్చేటప్పుడు అందంగా కనిపించేందుకు మంచి దుస్తులు, బంగారు ఆభరణాలు తీసుకురావాలని కోరాడు. ఇవన్ని నమ్మిన మహిళ అన్షుల్ జైన్ చెప్పిన విధంగానే బెంగళూర్ నుంచి ఢిల్లీకి వెళ్లింది.
ఆదివారం తనను నిందితుడు ఢిల్లీ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకున్నాడని, ఏరోసిటీ ఫుడ్ కోర్టులో భోజనం చేసిన తర్వాత అక్కడ నుంచి కారులో బయలుదేరామని, అర కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత కారు టైర్ లో ఏదో తేడాగా ఉందని చెప్పి, టైర్లు తనిఖీ చేసేందుకు దిగిన వెంటనే నిందితుడు తన విలువైన వస్తువులతో పారిపోయాడని మహిళ ఆరోపించింది. తన వద్ద నుంచి 300 గ్రాముల ఆభరణాలు, రూ.15 వేల నగదు, మొబైల్ ఫోన్, మూడు ఏటీఎం కార్డులు, బ్యాగ్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
-
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!