Ram Mandir: శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం.. వచ్చే ఏడాది రామ నవమికి సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు కోటి కళ్లలో రామ మందిరం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది 2024లో జనవరిలో ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ సారి శ్రీరామ నవమి వేడుకలు అయోధ్య రామ మందిరం సిద్ధం అవుతోంది. రామ నవమి వేడుకలు తాత్కాలిక ప్రాంగణంలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఆలయ నిర్మాణం పూర్తై, రామ మందిరంలోనే నవమి వేడుకలు జరగనున్నాయి.
సంక్రాతి నాటికి కాంక్రీట్ భవనం..
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 2024 నాటికి రామ మందిర గ్రౌండ్ ఫ్లోర్ అంటే గర్భగుడిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది రామ నవమికి ముందు మకర సంక్రాంతి రోజున రాముడి విగ్రహాలను తాత్కాలిక ఆలయం నుంచి గర్భగుడిలోకి తీసుకెళ్లవచ్చు. రామాలయ ప్రవేశ మెట్లు, సింహద్వారం మొదటి ప్రవేశమార్గం ప్రస్తుతం పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపుగా సిద్ధం అయింది.

గర్భగుడికి 12 అడుగుల వెడల్పు తలుపులు..
గుడిలోని మండపం ద్వారాలు మక్రానా పాలరాతితో చేయబడింది. వీటికి అమర్చే తలుపులను దేశంలోనే అత్యంత నాణ్యమైన టేకు కర్రతో తయారు చేయబోతున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా బల్హార్షా నుంచి టేకు కర్రతో తలుపులు చేయనున్నారు. ఇక్కడి నుంచి భక్తులు రాముడిని దర్శించుకుంటారు. ప్రస్తుతం గర్భగుడిలో పాలరాతిని అమర్చే పనులు జరుగుతున్నాయి. ఈ గర్భగుడికి బంగారు తలుపులను ఏర్పాటు చేయనున్నారు. 9 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఈ తలుపులు ఉండబోతున్నాయి.

గర్భగుడిలోకి ముగ్గురికి మాత్రమే అనుమతి..
వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న రామ మందిరం గర్భగుడిలోకి ముగ్గురు మాత్రమే వెళ్లనున్నారు. అర్చకులు, రాష్ట్రపతి, ప్రధాని మంత్రి మాత్రమే గర్భగుడిలోకి వెళ్లేందుకు అనుమతినిస్తారు. సాధారణ భక్తులకు ఈ అవకాశం లేదు. రామాలయంలో రెండు ప్రదక్షిణ మార్గాలు నిర్మించబడుతున్నాయి. వీటిలో గర్భగుడి ఒక ప్రదక్షిణ మార్గం తయారువుతోంది. అర్చకులు మాత్రమే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయగలరు.
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!