Asaduddin Owaisi: ముస్లింలను ఎవరూ పట్టించుకోవడం లేదు.. అందుకు ప్రధాని మోదీకి అభినందనలు..
Asaduddin Owaisi criticizes Prime Minister Narendra Modi: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలో కూడా ముస్లింలకు గౌరవం లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ముస్లింలను పార్టీలు ఏటీఎంలుగా వాడుకుంటున్నాయని అసదుద్దీన్ ఆరోపించారు. కర్ణాటక హుమ్నాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. గత ఎనిమిదేళ్లుగా సెక్యులర్ పార్టీలు కూడా ముస్లింల సమస్యలపై స్పందించడం లేదని.. అంతగా దేశ రాజకీయాలను మార్చినందుకు ప్రధాని మోదీకి అభినందనలని సెటైరికల్ కామెంట్స్ చేశారు. భారత రాజకీయాల్లో ఇప్పుడు ముస్లింలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని అసద్ అన్నారు.
Read Also: తెలంగాణలో భారత్ జూడో యాత్ర ఎంట్రీ
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
కేవలం సమాజంలో నుంచి ఓట్లు అడిగే రాజకీయ పార్టీలు ముస్లింలను ఏటీఎం యంత్రాలుగా చూస్తున్నారని విమర్శించారు. మీరు రాజకీయ పార్టీలో కావాలా..? అల్లా కావాలా..? అని ఆలోచించుకోవాలని, మీతో ఎవరూ లేరని ముస్లింలను ఉద్దేశించి ఓవైసీ అన్నారు. ముస్లింల అఘాయిత్యాలపై ఎవరూ మాట్లాడరని.. ముస్లింలు ఎవరికీ కనిపించడం లేదని.. ఇప్పుడు సెక్యులర్ పార్టీలు ముస్లింల సమస్యలు ఎత్తేందుకు కూడా భయపడుతున్నాయని.. ఇలా ప్రధాని మోదీ దేశ రాజకీయాలను మార్చారని అన్నారు. మీకు ఈ పార్టీల నుంచి ఏమైనా వస్తుందా..? బిల్కిస్ బానోకు మీరు ఏం సమాధానం చెప్తారు..? ఆమె మీ కుమార్తె కాదా..? అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ రేపిస్టులను విడుదల చేస్తే సెక్యుటర్ పార్టీలు మౌనంగా కూర్చున్నాయని ఓవైసీ అన్నారు.
ఇది అంబేద్కర్ భూమి అని.. మన రక్తం, చెమటలో ఈ భూమికి స్వాతంత్య్రం తెచ్చుకున్నామని..ముస్లింలు తమ ప్రాణాలను ఎక్కువగా త్యాగం చేశారని ఆయన అన్నారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ లేవని.. తర్వాత వచ్చిన వాళ్లంతా హీరోలు కాగా.. తమ రక్తాన్ని ఈ భూమి కోసం అర్పించిన వారు జీరోలు అయ్యారని అసదుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. 1925 తర్వాత వచ్చిన వారు స్వాతంత్య్రం తీసుకురాలేనది అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై విమర్శలు గుప్పించారు అసదుద్దీన్ ఓవైసీ.
తాజావార్తలు
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
-
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
-
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!