PM Narendra Modi: నేడు ప్రధాని అయోధ్య పర్యటన.. దీపోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi to visit Ayodhya on Diwali eve: ప్రధాని నరేంద్ర మోదీ వరసగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించిన ఆయన ఆదివారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. నిర్మాణంలో ఉన్న రామజన్మభూమి ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. ఆ తరువాత అయోధ్యలో జరిగే దీపోత్సవ కార్యక్రమానికి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మోదీ వెంట ఉండనున్నారు. రామాలయ నిర్మాణం గురించి ప్రధాని మోదీకి, యోగి దగ్గరుండి వివరించనున్నారు. దీపోత్సవ వేడుకల్లో ప్రధానితో కలిసి సీఎం యోగి పాల్గొననున్నారు.
Read Also: Arif Mohammed Khan: కేరళ డ్రగ్స్ రాజధానిగా మారుతోంది.. రాష్ట్ర పరిస్థితిని చూసి సిగ్గుపడుతున్నా..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రామజన్మభూమిలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రామ్ కథా పార్కర్ లో రాముడు, సీతాదేవీకి పట్టాభిషేకం జరిగే కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం అనంతరం రామ్ కీ పైడి ఘాట్ వద్ద ప్రధాని మోదీ తొలి దీపాన్ని వెలిగించనున్నారు. రామ్ కి పైడితో పాటు 37 ఘాట్లలో 1.8 మిలియన్ల దీపాలను వెలిగించాలని ప్లాన్ చేశారు. దీపోత్సవ కార్యక్రమంలో దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేయాలని అయోధ్య పాలక వర్గం భావిస్తోంది. సరయూ నది ఒడ్డున జరిగే ఆరతి కార్యక్రమానికి కూడా ప్రధాని మోదీ హాజరు అవుతారు. ప్రధాని హోదాలో రెండోసారి అయోధ్యకు వెళ్తున్నారు. ఆగస్టు 5,2020న రామమందిర భూమి పూజకు వెళ్లిన ఆయన దీపావళి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అయోధ్యకు వెళ్తున్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!