PM Narendra Modi: నేడు ప్రధాని అయోధ్య పర్యటన.. దీపోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi to visit Ayodhya on Diwali eve: ప్రధాని నరేంద్ర మోదీ వరసగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించిన ఆయన ఆదివారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. నిర్మాణంలో ఉన్న రామజన్మభూమి ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. ఆ తరువాత అయోధ్యలో జరిగే దీపోత్సవ కార్యక్రమానికి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మోదీ వెంట ఉండనున్నారు. రామాలయ నిర్మాణం గురించి ప్రధాని మోదీకి, యోగి దగ్గరుండి వివరించనున్నారు. దీపోత్సవ వేడుకల్లో ప్రధానితో కలిసి సీఎం యోగి పాల్గొననున్నారు.
Read Also: Arif Mohammed Khan: కేరళ డ్రగ్స్ రాజధానిగా మారుతోంది.. రాష్ట్ర పరిస్థితిని చూసి సిగ్గుపడుతున్నా..
Also Read
- Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
- Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
- IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రామజన్మభూమిలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రామ్ కథా పార్కర్ లో రాముడు, సీతాదేవీకి పట్టాభిషేకం జరిగే కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం అనంతరం రామ్ కీ పైడి ఘాట్ వద్ద ప్రధాని మోదీ తొలి దీపాన్ని వెలిగించనున్నారు. రామ్ కి పైడితో పాటు 37 ఘాట్లలో 1.8 మిలియన్ల దీపాలను వెలిగించాలని ప్లాన్ చేశారు. దీపోత్సవ కార్యక్రమంలో దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేయాలని అయోధ్య పాలక వర్గం భావిస్తోంది. సరయూ నది ఒడ్డున జరిగే ఆరతి కార్యక్రమానికి కూడా ప్రధాని మోదీ హాజరు అవుతారు. ప్రధాని హోదాలో రెండోసారి అయోధ్యకు వెళ్తున్నారు. ఆగస్టు 5,2020న రామమందిర భూమి పూజకు వెళ్లిన ఆయన దీపావళి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అయోధ్యకు వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!