Asaduddin Owaisi: ఆ విషయంలో ప్రధాని మోదీని చిరుతతో పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi comments on PM narendra modi: ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కు పెట్టారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. తీవ్రమైన సమస్యల నుంచి తప్పించుకునే విషయంలో ప్రధాని మోదీ చిరుతల కన్నా వేగంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజస్థాన్ జైపూర్ పర్యటకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. జ్ఞాన్వాపి మసీదు-శృంగర్ గౌరీ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రార్థనా స్థలాల చట్టానికి వ్యతిరేకంగా ఆయన అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మదర్సాలపై ప్రభుత్వాలు సర్వే చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈనెల 17 ప్రధాని మోదీ చేతుల మీదుగా కునో నేషనల్ పార్క్ లో చిరుతలను ప్రవేశపెడుతున్నారు. అయితే దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ. ద్రవ్యోల్భనం, నిరుద్యోగం సమస్యలను లేవనెత్తినప్పుడు ప్రధాని మోదీ చిరుత కన్నా వేగంగా తప్పించుకుంటారని ఎద్దేవా చేశారు. చైనా మన భూభాగాలను ఆక్రమించిందని మనం చెప్పినప్పుడు, చిరుత కన్నా మోదీ జీ వేగంగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Also Read
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
Read Also: Amit Shah: ప్రభాస్ తో అమిత్ షా భేటీ.. కారణం అదే..?
జ్ఞాన్వాపి మసీదు కేసులో వారణాసి కోర్టు 1991 ప్రార్థన స్థలాల చట్టాలను ఉల్లంఘించిందని ఆయన విమర్శించారు. ఈ కేసులు ఈ చట్టం పరిధిలోకి రానది కోర్టు తీర్పు చెప్పడాన్ని తప్పు పట్టారు. ప్రైవేటుగా నిర్వహించే మదర్సాలపై యూపీ ప్రభుత్వం సర్వే చేపట్టడాన్ని ఎన్ఆర్సీగా అభివర్ణించారు ఆయన. మదర్సాలపై సర్వేను మినీ ఎన్ఆర్సీ అని పేర్కొన్నారు. కేవలం మదర్సాలపైనే ఎందుకు సర్వే చేస్తున్నారు.. ఆర్ఎస్ఎస్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలు, మిషనరీ పాఠశాలపై ఎందుకు సర్వే చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈనెల 17 కునో నేషనల్ పార్క్ లో 8 చిరుతలను ప్రధాని మోదీ ప్రవేశపెట్టనున్నారు. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో ఈ శుక్రవారం చిరుతలు జైపూర్ కు రానున్నాయి. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్క్ కు తరలించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే రోజు వీటిని నేషనల్ పార్క్ లో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
-
DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!