Terrorist Yasin Malik: యాసిన్ మాలిక్కి మరణశిక్ష విధించాలని కోరిన ఎన్ఐఏ.. విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..
- ఉగ్రవాది యాసిన్ మాలిక్కి మరణశిక్ష విధించాలి..
- ఢిల్లీ హైకోర్టులో ఎన్ఐఏ అప్పీల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్కి మరణశిక్ష విధించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఢిల్లీ హైకోర్టలో అప్పీల్ చేసింది. అయితే, ఈ దర్యాప్తు నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ శర్మ గురువారం తప్పుకున్నారు. ఎన్ఐఏ అప్పీల్పై అంతకుముందు బెంజ్ యాసిన్ మాలిక్ ప్రతిస్పందనను కోరింది. దీనిని అరుదైన కేసుగా పేర్కొంది. ఈ అప్పీల్ గురువారం జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యం విచారణకు రాగానే జస్టిస్ అమిత్ శర్మ విచారణ నుంచి తప్పుకున్నారు. ఢిల్లీ హైకోర్టు దీనిని వివిధ బెంచ్ల ముందు ఆగస్టు 9వ తేదీని జాబితా చేసింది.
మే 2023లో, టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కాశ్మీర్కి చెందిన ఉగ్రవాది యాసిన్ మాలిక్కి ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్ఐఏ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో, జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ మరియు జస్టిస్ తల్వంత్ సింగ్లతో కూడిన బెంచ్, యాసిన్ మాలిక్ తీహార్ జైలులో ఉన్నందున, జైలు సూపరింటెండెంట్ ద్వారా యాసిన్ మాలిక్కు నోటీసు జారీ చేసింది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
అంతకుముందు ఎన్ఐఏ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నలుగురు ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందిని హతమార్చి, రుబయ్యా సయీద్ని కిడ్నాప్ చేసినందుకు యాసిన్ మాలిక్ కారణమని వాదించారు. ఈ కిడ్నాప్ తరుపున విడుదలైన నలుగురు ఉగ్రవాదులు 26/11 ముంబై దాడులకు సూత్రధారులగా ఉన్నారని కోర్టుకు చెప్పారు. ఆయుధాల నిర్వహణలో శిక్షణ పొందేందుకు నిందితుడు యాసిన్ మాలిక్ 1980లలో పాకిస్థాన్కు వెళ్లాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అతను జేకేఎల్ఎఫ్ అధిపతి కావడానికి పాక్ ఐఎస్ఐ సాయం చేసింది.
Read Also: Reels: రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి.. బస్సును ఢీకొని మృతి
ఎన్ఐఏ తన అప్పీల్లో ఇలాంటి భయంకరమైన టెర్రరిస్టులు నేరాన్ని అంగీకరించిన తర్వాత మరణశిక్ష విధించకపోతే, అది దేశ శిక్షా విధానంపై ప్రశ్నలు వస్తాయని పేర్కొంది. ఇలాంటి భయంకరమైన ఉగ్రవాది దేశానికి వ్యతిరేకంగా యుద్ధ చర్యలో పాల్గొనడం, నిర్వహించడం, నాయకత్వం వహించిన తర్వాత మరణశిక్ష విధించాలని కోర్టులో అప్పీల్ చేసింది. ఇలాంటి ఉగ్రవాదుల వల్ల దేశం తన విలువైన సైనికులను కోల్పోయిందని, సైనిక కుటుంబ సభ్యులకే కాకుండా యావత్ ప్రజలకు కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని ఎన్ఐఏ తన అప్పీల్లో పేర్కొంది.
అంతకుముందు మే 25, 2022న, టెర్రర్ ఫండింగ్ కేసులో JKLF నాయకుడు యాసిన్ మాలిక్కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. న్యాయమూర్తి తీర్పు చెబుతూ.. ఈ దోషికి సంస్కరణ లేదు, 1994లో తాను తుపాకీని వదులుకున్నాడనేది సరైనదే కావచ్చు, కీనా కానీ 1994 సంవత్సరానికి ముందు అతను చేసిన హింసకు అతను ఎప్పుడూ విచారం వ్యక్తం చేయలేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నేరం జరిగిన తీరు, నేరంలో ఉపయోగించిన ఆయుధాల తీరు, అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా అభివర్ణించారు. NIA కోర్టు, యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు విధిస్తూ, రూ. 10 లక్షల పైన జరిమానా కూడా విధించింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!