Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Anti Terror Probe Agency Nia Seeks Death Penalty For Terrorist Yasin Malik

Terrorist Yasin Malik: యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలని కోరిన ఎన్ఐఏ.. విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..

Published Date :July 11, 2024 , 5:12 pm
By Venu Goapl Reddy
  • ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలి..
  • ఢిల్లీ హైకోర్టులో ఎన్ఐఏ అప్పీల్..
Terrorist Yasin Malik: యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలని కోరిన ఎన్ఐఏ.. విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Terrorist Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఢిల్లీ హైకోర్టలో అప్పీల్ చేసింది. అయితే, ఈ దర్యాప్తు నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ శర్మ గురువారం తప్పుకున్నారు. ఎన్ఐఏ అప్పీల్‌పై అంతకుముందు బెంజ్ యాసిన్ మాలిక్ ప్రతిస్పందనను కోరింది. దీనిని అరుదైన కేసుగా పేర్కొంది. ఈ అప్పీల్ గురువారం జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యం విచారణకు రాగానే జస్టిస్ అమిత్ శర్మ విచారణ నుంచి తప్పుకున్నారు. ఢిల్లీ హైకోర్టు దీనిని వివిధ బెంచ్‌ల ముందు ఆగస్టు 9వ తేదీని జాబితా చేసింది.

మే 2023లో, టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కాశ్మీర్‌కి చెందిన ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కి ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్ఐఏ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో, జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ మరియు జస్టిస్ తల్వంత్ సింగ్‌లతో కూడిన బెంచ్, యాసిన్ మాలిక్ తీహార్ జైలులో ఉన్నందున, జైలు సూపరింటెండెంట్ ద్వారా యాసిన్ మాలిక్‌కు నోటీసు జారీ చేసింది.

అంతకుముందు ఎన్‌ఐఏ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నలుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని హతమార్చి, రుబయ్యా సయీద్‌ని కిడ్నాప్ చేసినందుకు యాసిన్ మాలిక్ కారణమని వాదించారు. ఈ కిడ్నాప్ తరుపున విడుదలైన నలుగురు ఉగ్రవాదులు 26/11 ముంబై దాడులకు సూత్రధారులగా ఉన్నారని కోర్టుకు చెప్పారు. ఆయుధాల నిర్వహణలో శిక్షణ పొందేందుకు నిందితుడు యాసిన్ మాలిక్ 1980లలో పాకిస్థాన్‌కు వెళ్లాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అతను జేకేఎల్ఎఫ్ అధిపతి కావడానికి పాక్ ఐఎస్ఐ సాయం చేసింది.

Read Also: Reels: రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి.. బస్సును ఢీకొని మృతి

ఎన్ఐఏ తన అప్పీల్‌లో ఇలాంటి భయంకరమైన టెర్రరిస్టులు నేరాన్ని అంగీకరించిన తర్వాత మరణశిక్ష విధించకపోతే, అది దేశ శిక్షా విధానంపై ప్రశ్నలు వస్తాయని పేర్కొంది. ఇలాంటి భయంకరమైన ఉగ్రవాది దేశానికి వ్యతిరేకంగా యుద్ధ చర్యలో పాల్గొనడం, నిర్వహించడం, నాయకత్వం వహించిన తర్వాత మరణశిక్ష విధించాలని కోర్టులో అప్పీల్ చేసింది. ఇలాంటి ఉగ్రవాదుల వల్ల దేశం తన విలువైన సైనికులను కోల్పోయిందని, సైనిక కుటుంబ సభ్యులకే కాకుండా యావత్ ప్రజలకు కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని ఎన్‌ఐఏ తన అప్పీల్‌లో పేర్కొంది.

అంతకుముందు మే 25, 2022న, టెర్రర్ ఫండింగ్ కేసులో JKLF నాయకుడు యాసిన్ మాలిక్‌కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. న్యాయమూర్తి తీర్పు చెబుతూ.. ఈ దోషికి సంస్కరణ లేదు, 1994లో తాను తుపాకీని వదులుకున్నాడనేది సరైనదే కావచ్చు, కీనా కానీ 1994 సంవత్సరానికి ముందు అతను చేసిన హింసకు అతను ఎప్పుడూ విచారం వ్యక్తం చేయలేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నేరం జరిగిన తీరు, నేరంలో ఉపయోగించిన ఆయుధాల తీరు, అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా అభివర్ణించారు. NIA కోర్టు, యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ, రూ. 10 లక్షల పైన జరిమానా కూడా విధించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi High Court
  • jammu kashmir
  • NIA appeal death penalty
  • yasin malik

తాజావార్తలు

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

  • Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions