Reels: రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి.. బస్సును ఢీకొని మృతి
- రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి
- బైక్ పై రీల్స్ చేస్తూ బస్సును ఢీకొట్టిన యువకులు
- అక్కడికక్కడే ఇద్దరు మృతి
- ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో హైలైట్ అవడం కోసం యువకుల తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం, వ్యూస్ కోసం ఏకంగా ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిపోవాలని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. కష్టపడి చేసిన వీడియోకు అనుకున్న స్థాయిలో లైకులు, వ్యూస్ రాకపోతే వారికి చాలా బాధగా ఉంటుంది. ఒక్కోసారి డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుండగా.. కొందరు మాత్రం చేజేతులా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన జరిగింది.
CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా..
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
- Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ 'తవా పనీర్ టిక్కా'.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
గురువారం తెల్లవారుజామున వారణాసిలో ఒకే బైక్పై రీల్స్ చేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. దీంతో.. వారు వంద మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ప్రమాదానికి పాల్పడ్డ బస్సును పట్టుకున్నారు. అయితే.. ఈ ఘటనకు ముందు ముగ్గురు యువకులు మార్గమధ్యంలో ఓ యువకుడిని ఢీకొట్టారని పోలీసులు చెబుతున్నారు. రోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చితాయ్పూర్ ఖానావ్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతులు అఖారి గ్రామానికి చెందిన సాహిల్ రాజ్భర్(16), చంద్రశేఖర్రాజ్భర్(16), శివమ్ రాజ్భర్(16)గా గుర్తించారు. ఈ యువకులు కేటీఎం బైక్ పై బచావ్ బజార్కు వెళ్లినట్లు తెలిపారు. బచావ్ మార్కెట్ నుండి అక్రి వైపు తిరిగి వస్తూ.. బైక్ను ఊపుతూ రీల్స్ చేస్తున్నారు. ఇంతలో ఎదురుగా వస్తున్న బస్సును యువకుల బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చంద్రశేఖర్, సాహిల్ అక్కడికక్కడే మృతి చెందారు. శివమ్ను ట్రామా సెంటర్కు తరలిస్తుండగా.. చనిపోయాడు. ముగ్గురూ అఖారి గ్రామానికి చెందిన యువకులు.
- Tags
- bike
- bus
- died
- reels
- three youths
తాజావార్తలు
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..