Asim Munir: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ అనుభూతి పొందాం.. అసిమ్ మునీర్ వ్యాఖ్య
- పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలు వైరల్
- ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ అనుభూతి పొందాం
- ఖురాన్ వాక్యాన్ని ఉదహరించిన మునీర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన సంఘటనను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యానించిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దైవిక సహాయం పొందినట్లుగా తెలిపాడు. భారత దళాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఈ సహాయం పొందినట్లుగా పేర్కొన్నాడు. మునీర్ చేసిన ప్రసంగం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తెరపైకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ ఫొటోలు తొలగింపు! సమర్థించిన టాడ్ బ్లాంచే
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
ఇస్లామాబాద్లో జరిగిన జాతీయ ఉలేమా సమావేశంలో అసిమ్ మునీర్ ప్రసంగించాడు. ఈ సందర్భంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు దైవిక సహాయం లభించినట్లుగా పేర్కొన్నాడు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో తేదీ లేని క్లిప్ వైరల్ అవుతోంది. ఉర్దూలో మాట్లాడిన మునీర్ ‘‘అల్లాహ్ మీకు సహాయం చేస్తే ఎవరూ మిమ్మల్ని అధిగమించలేరు.’’ అనే ఖురాన్ వాక్యాన్ని ఉదహరించాడు. శత్రువులు దాడి చేస్తున్న సమయంలో పాకిస్థాన్కు కనిపించని మద్దతు లభించినట్లుగా పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Nicki Minaj: జేడీ వాన్స్ ‘హంతకుడు’.. రాప్ స్టార్ నిక్కీ మినాజ్ అనుచిత వ్యాఖ్య
ఆద్యంతం మునీర్ చేసిన ప్రసంగమంతా మతపరమైన అంశాలనే ప్రస్తావించాడు. ఆధునిక పాకిస్థాన్ను 1,400 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఇస్లామిక్ రాజ్యాంతో పోల్చాడు. ముస్లిం దేశాల గురించి ప్రస్తావిస్తూ… ప్రపంచ వ్యాప్తంగా 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయని.. అయితే అందుకు భిన్నంగా పాకిస్థాన్కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నాడు. ఇక పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దు వెంబడి భద్రతా సమస్యలను కూడా ప్రస్తావించాడు. పాకిస్థాన్లోకి చొరబడుతున్న వారిలో ఎక్కువగా ఆప్ఘన్ జాతీయులే ఉన్నారని ఆరోపించాడు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 7న పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడులు చేశాయి. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. మొత్తానికి మే 10న ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.
తాజావార్తలు
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
-
Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!