Yogi Adityanath: “సనాతన ధర్మాన్ని” తిట్టడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: సనాతన ధర్మాన్ని దూషించడం, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి ఉనికిని ప్రశ్నించడం ప్రతిపక్ష నేతలకు ఫ్యాషన్గా మారిందని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అన్నారు. సమాజ్వాదీ(ఎస్పీ) పార్టీ మద్దతుదారులు రామభక్తులపై కాల్పులు జరిపారని, ఉగ్రవాదులకు హారతి ఇస్తున్నారని ఆయన విమర్శించారు. నేరస్తులపై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ, ప్రతిపక్ష పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు శ్రీరామ భక్తుల మరనాన్ని జరుపుకుంటాయి, గ్యాంగ్స్టర్ మరణానికి మొసలి కన్నీరు కారుస్తాయని ఆయన ఆరోపించారు.
Read Also: Worldcup jersey: ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో టీమిండియా జెర్సీ.. ధరలు ఇలా..
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
సగానికి పైగా లోక్సభ స్థానాల్లో ఎన్నికలు ముగిశాయని, దేశం మొత్తం‘‘ఆబ్కీ బార్ 400 పార్’’ నినాదం ప్రతిధ్వనిస్తోందని ఆయన అన్నారు. రాముడు, కృష్ణుడిని అవమానించే వారికి సరైన స్థానాన్ని చూపించేందుకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ‘‘రాముడు మరియు కృష్ణుడి గురించి ప్రశ్నలు లేవనెత్తే వారిని మనం ఎలా అంగీకరించగలం? అంతిమంగా, దేశ ప్రజలే వారి ఓట్ల ద్వారా సమాధానం ఇస్తారు’’ అని చెప్పారు.
సీతాపూర్లోని పుణ్యక్షేత్రమైన నైమిశారణ్య అభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అయోధ్య పునరుజ్జీవం పొందినట్లే నైమిశారణ్య కూడా పరివర్తన చెందుతోందని, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఎస్పీ యువతకు పిస్టల్స్, ఆయుధాలు అందిస్తే తాము మాత్రం ట్యాబ్లు అందిస్తున్నామని యోగి చెప్పారు. భారత విభజన తర్వాత ఏర్పడిన పాకిస్తాన్ ఆకలితో అలమటిస్తోందని, అక్కడ కిలో పిడి కోసం పోరాటాలు జరుగుతున్నాయని, భారత్లో మాత్రం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని వెల్లడించారు. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు పేదలకు మద్దతుగా నిలుస్తారని, వారికి చికిత్స అవసరమైన ప్రభుత్వ సౌకర్యాలు, ఆర్థిక సాయం అందేలా చూస్తున్నారని చెప్పారు.
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!