Meghalaya: మేఘాలయలో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ.. సీఎంల రహస్య సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya: నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ మార్చి 2న వెలువడబోతున్నాయి. ఇదిలా ఉంటే త్రిపురలో సొంతంగా బీజేపీ అధికారంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. దీంతో పాటు నాగాలాండ్ రాష్ట్రంలో మిత్రపక్షం ఎన్పీపీతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మేఘాలయలో బీజేపీకి సీట్లు తక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
అయితే గతంలో ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న బీజేపీ, మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)ని కాదని ఈసారి ఎన్నికల్లో సొంతంగా బరిలో దిగింది. తాజా ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ప్రస్తుతం ముఖ్యమంత్రి కన్నాడ్ సంగ్మా పార్టీ అయిన ఎన్పీపీకి మెజారిటీ సీట్లు సాధిస్తుందని, మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదని చెబుతున్నాయి.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Revanth Reddy: ఇసుకని అక్రమంగా దోచుకుంటున్నారు.. బండి సంజయ్, ఈటెల ఏం చేస్తున్నారు?
ఈ నేపధ్యంలో తన పాత మితపక్షం బీజేపీతో కలిసి ఎన్పీపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా గౌహతిలో సమావేశం అయినట్లు సమాచారం. మేఘాలయలో ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ముఖ్యమంత్రి అర్ధరాత్రి అస్సాం కౌంటర్తో సమావేశమయ్యారని విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఎన్పీపీ కలిసి కాంగ్రెస్ ను చిత్తు చేశాయి.
గౌహతిలోని ఓ హోటల్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ అక్కడి బీజేపీ+ఎన్పీపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ అర్థరాత్రి సమావేశం తరువాత సంగ్మా బుధవారం ఉదయం మేఘాలయలోని తన స్వస్థలం తురాకు తిరిగి వెళ్లారని తెలిసింది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల వ్యూహకర్తగా బీజేపీ తరుపును హిమంత బిశ్వ సర్మ పనిచేస్తున్నారు. మేఘాలయలో ఎన్పీపీ, కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలతో జట్టుకట్టబోదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!