Meghalaya: మేఘాలయలో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ.. సీఎంల రహస్య సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya: నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ మార్చి 2న వెలువడబోతున్నాయి. ఇదిలా ఉంటే త్రిపురలో సొంతంగా బీజేపీ అధికారంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. దీంతో పాటు నాగాలాండ్ రాష్ట్రంలో మిత్రపక్షం ఎన్పీపీతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మేఘాలయలో బీజేపీకి సీట్లు తక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
అయితే గతంలో ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న బీజేపీ, మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)ని కాదని ఈసారి ఎన్నికల్లో సొంతంగా బరిలో దిగింది. తాజా ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ప్రస్తుతం ముఖ్యమంత్రి కన్నాడ్ సంగ్మా పార్టీ అయిన ఎన్పీపీకి మెజారిటీ సీట్లు సాధిస్తుందని, మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదని చెబుతున్నాయి.
Also Read
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
Read Also: Revanth Reddy: ఇసుకని అక్రమంగా దోచుకుంటున్నారు.. బండి సంజయ్, ఈటెల ఏం చేస్తున్నారు?
ఈ నేపధ్యంలో తన పాత మితపక్షం బీజేపీతో కలిసి ఎన్పీపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా గౌహతిలో సమావేశం అయినట్లు సమాచారం. మేఘాలయలో ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ముఖ్యమంత్రి అర్ధరాత్రి అస్సాం కౌంటర్తో సమావేశమయ్యారని విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఎన్పీపీ కలిసి కాంగ్రెస్ ను చిత్తు చేశాయి.
గౌహతిలోని ఓ హోటల్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ అక్కడి బీజేపీ+ఎన్పీపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ అర్థరాత్రి సమావేశం తరువాత సంగ్మా బుధవారం ఉదయం మేఘాలయలోని తన స్వస్థలం తురాకు తిరిగి వెళ్లారని తెలిసింది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల వ్యూహకర్తగా బీజేపీ తరుపును హిమంత బిశ్వ సర్మ పనిచేస్తున్నారు. మేఘాలయలో ఎన్పీపీ, కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలతో జట్టుకట్టబోదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..