MP: ఆస్పత్రిలో అమానుషం.. వృద్ధుడిని ఈడ్చికెళ్లిన సిబ్బంది. వైద్యులు సస్పెండ్
- మధ్యప్రదేశ్లో ఆస్పత్రిలో అమానుషం
- వృద్ధుడిని ఈడ్చికెళ్లిన సిబ్బంది
- ఇద్దరు వైద్యులు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది.
ఇది కూడా చదవండి: Rajni : జైలర్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్.. అతిగా ఆశపడుతున్న మేకర్స్
Also Read
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
ఏప్రిల్ 17న నౌగావ్ పట్టణానికి చెందిన ఉద్ధవ్ సింగ్ జోషి (77).. భార్య వైద్య పరీక్షల కోసం ఛతర్పూర్లోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరు వ్యక్తులు.. జోషిని లాక్కెళ్లారు. టైమ్ స్లాట్ స్లిప్ తీసుకుని చాలా సేపు క్యూలో ఉన్నానని.. తన వంతు వచ్చినప్పుడు డాక్టర్ రాజేష్ మిశ్రా అభ్యంతరం చెప్పి చెంపదెబ్బ కొట్టాడని జోషి ఆరోపించాడు. అప్పటికే ఆ స్థలం రద్దీగా ఉందని.. క్యూలో నిలబడే విషయంలో డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశాడని సివిల్ సర్జన్ జీఎల్ అహిర్వర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gaza-Israel: 15 మంది వైద్యుల హత్య.. ఉద్దేశపూర్వకంగా జరగలేదన్న ఐడీఎఫ్
ఘటనపై క్లారిటీ రాలేదు గానీ.. వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిశ్రా, అహిర్వార్కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కఠిన చర్యలు తీసుకున్నారు. వైద్య సేవల నుంచి మిశ్రాను తొలగించారు. ఇక ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించినందుకు సబార్డినేట్లను నియంత్రించడంలో విఫలమైనందుకు అహిర్వార్ను కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ పార్థ్ జైస్వాల్ ఆదేశాలను కూడా అహిర్వర్ విస్మరించారు. షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడం వేటు పడింది. అంతేకాకుండా ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ఉద్యోగి రాజేంద్ర ఖరేను కూడా తొలగించాలని కలెక్టర్ జైస్వాల్ సిఫార్సు చేసినట్లు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి
ఇదిలా ఉంటే వృద్ధుడిని ఈడ్చికెళ్లిన ఘటనలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 115(2), 296, 3(5), మరియు 351(3) కింద నౌగావ్ పోలీస్ స్టేషన్లో మిశ్రాపై ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఎఫ్ఐఆర్ను ఛతర్పూర్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.
• 75 साल के बुजुर्ग को #छतरपुर जिला अस्पताल के डॉक्टर्स और अस्पताल स्टाफ द्वारा न सिर्फ लात-घूंसे मारे गए, बल्कि बेरहमी से घसीटकर अस्पताल से बाहर फेंक दिया गया!
• पत्नी के इलाज के लिए आए बुजुर्ग का कसूर सिर्फ इतना था कि वे लंबी लाइन में लंबे वक्त तक खड़े नहीं हो पा रहे थे,… pic.twitter.com/VAB1MeMb1s
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) April 20, 2025
తాజావార్తలు
-
CM Convey: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!