MP: ఆస్పత్రిలో అమానుషం.. వృద్ధుడిని ఈడ్చికెళ్లిన సిబ్బంది. వైద్యులు సస్పెండ్
- మధ్యప్రదేశ్లో ఆస్పత్రిలో అమానుషం
- వృద్ధుడిని ఈడ్చికెళ్లిన సిబ్బంది
- ఇద్దరు వైద్యులు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది.
ఇది కూడా చదవండి: Rajni : జైలర్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్.. అతిగా ఆశపడుతున్న మేకర్స్
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
ఏప్రిల్ 17న నౌగావ్ పట్టణానికి చెందిన ఉద్ధవ్ సింగ్ జోషి (77).. భార్య వైద్య పరీక్షల కోసం ఛతర్పూర్లోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరు వ్యక్తులు.. జోషిని లాక్కెళ్లారు. టైమ్ స్లాట్ స్లిప్ తీసుకుని చాలా సేపు క్యూలో ఉన్నానని.. తన వంతు వచ్చినప్పుడు డాక్టర్ రాజేష్ మిశ్రా అభ్యంతరం చెప్పి చెంపదెబ్బ కొట్టాడని జోషి ఆరోపించాడు. అప్పటికే ఆ స్థలం రద్దీగా ఉందని.. క్యూలో నిలబడే విషయంలో డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశాడని సివిల్ సర్జన్ జీఎల్ అహిర్వర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gaza-Israel: 15 మంది వైద్యుల హత్య.. ఉద్దేశపూర్వకంగా జరగలేదన్న ఐడీఎఫ్
ఘటనపై క్లారిటీ రాలేదు గానీ.. వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిశ్రా, అహిర్వార్కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కఠిన చర్యలు తీసుకున్నారు. వైద్య సేవల నుంచి మిశ్రాను తొలగించారు. ఇక ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించినందుకు సబార్డినేట్లను నియంత్రించడంలో విఫలమైనందుకు అహిర్వార్ను కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ పార్థ్ జైస్వాల్ ఆదేశాలను కూడా అహిర్వర్ విస్మరించారు. షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడం వేటు పడింది. అంతేకాకుండా ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ఉద్యోగి రాజేంద్ర ఖరేను కూడా తొలగించాలని కలెక్టర్ జైస్వాల్ సిఫార్సు చేసినట్లు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి
ఇదిలా ఉంటే వృద్ధుడిని ఈడ్చికెళ్లిన ఘటనలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 115(2), 296, 3(5), మరియు 351(3) కింద నౌగావ్ పోలీస్ స్టేషన్లో మిశ్రాపై ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఎఫ్ఐఆర్ను ఛతర్పూర్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.
• 75 साल के बुजुर्ग को #छतरपुर जिला अस्पताल के डॉक्टर्स और अस्पताल स्टाफ द्वारा न सिर्फ लात-घूंसे मारे गए, बल्कि बेरहमी से घसीटकर अस्पताल से बाहर फेंक दिया गया!
• पत्नी के इलाज के लिए आए बुजुर्ग का कसूर सिर्फ इतना था कि वे लंबी लाइन में लंबे वक्त तक खड़े नहीं हो पा रहे थे,… pic.twitter.com/VAB1MeMb1s
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) April 20, 2025
తాజావార్తలు
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!