Gaza-Israel: 15 మంది వైద్యుల హత్య.. ఉద్దేశపూర్వకంగా జరగలేదన్న ఐడీఎఫ్
- గాజాలో 15 మంది వైద్యుల హత్య
- ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా విమర్శలు
- విచారకరమని.. ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఐడీఎఫ్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిశాక పరిస్థితులు అదుపు తప్పాయి. హమాస్ అంతమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే సారి బందీలను విడుదల చేసేంత వరకు యుద్ధం కొనసాగుతుందని ఐడీఎఫ్ పేర్కొంది. ఇదిలా ఉంటే మార్చి 23న ఉగ్రవాదులు అంబులెన్స్లో వెళ్తున్నారన్న అనుమానంతో ఐడీఎఫ్ దళాలు దాడి చేయడంతో 15 మంది అత్యవసర వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ అంశంపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అత్యవసర వైద్య సిబ్బందిపై విచక్షణారహిత దాడులు ఏంటి? అని ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇజ్రాయెల్ దర్యాప్తు చేపట్టింది.
ఇది కూడా చదవండి: Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
అయితే ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని.. విచక్షణారహితంగా దాడులు చేయలేదని ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం పేర్కొంది. ఎమర్జెన్సీ సిగ్నల్స్ లేకపోవడంతో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో దాడి చేసినట్లు తెలిపింది. అయినా వైద్యులు చనిపోవడం విచారకరమని.. దీనికి చింతిస్తు్న్నట్లు తెలిపింది. పొరపాటు జరిగిందంటూ ఐడీఎఫ్ అంగీకరించింది. దళాల వైఫల్యం కనిపించడంతో ఫీల్డ్ కమాండర్ను ఇజ్రాయెల్ తొలగించింది. అయితే అంబులెన్స్లో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: JD Vance: నేటి నుంచి 4 రోజులు భారత్లో జేడీ వాన్స్ ఫ్యామిలీ పర్యటన
అంబులెన్స్ ఘటనలో 8 మంది రెడ్ క్రాస్ సిబ్బంది, గాజా సివిల్ డిఫెన్స్ రెస్క్యూ ఏజెన్సీకి చెందిన ఆరుగురు, ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదులు అంబులెన్స్లను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అంబులెన్స్లు వెళ్లేటప్పుడు సిగ్నల్స్ ఇవ్వకుండా వెళ్తున్నాయని ఐడీఎఫ్ పేర్కొంది. అయితే వీడియో ఫుటేజ్లో మాత్రం అంబులెన్స్ హెడ్లైట్లు వేసుకుని.. ఎమర్జెన్సీ లైట్లు వేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దృశ్యాలు కనిపించడంతో ఇజ్రాయెల్ విచారం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటు కోసం జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..