Manipur: మణిపూర్ లో 50 ఏళ్ల మహిళను కాల్చి చంపిన దుండగులు.. రాష్ట్రంలో ఆగని హింస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్ లో గత రెండున్నర నెలలుగా హింస కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ఎటువంటి హెచ్చరికలు జారీ చేసినా ఇప్పటికే హింస ఆగడం లేదు. తాజాగా మణిపూర్లో ఒక ఇంట్లోకి చొరబడిన దుండగులు 50 ఏళ్ల మహిళను దారుణంగా కాల్చి చంపారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్లోని ఈస్ట్ జిల్లా సావోంబంగ్ ప్రాంతంలో 50 ఏళ్ల వయసున్న మహిళ ముఖంపై దుండుగులు కాల్పులు జరిపారు. ఆమె ఇంట్లోకి చొరబడి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆమె ముఖాన్ని వికృతంగా మార్చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మణిపూర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సమీప ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనలో చనిపోయిన మహిళ కొంత మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని.. ఆ మహిళ మారింగ్ నాగా కమ్యూనిటీకి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆ మహిళ ఎవరనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రజల వాంగ్మూలాలు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Governor Tamilisai: బోనాల కోసం నాకు ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ రాలేదు..
Also Read
- IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
- Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
మరో ఘటనలో పార్క్ చేసిన ట్రక్కులను కూడా దుండగులు తగులబెట్టారు. ఇంఫాల్ (డబ్ల్యూ) నుంచి నేషనల్ హైవే -2 మీదుగా వెళ్తున్న సిలిండర్లను తీసుకెళ్లడానికి ఉపయోగించే ట్రక్కులను బహిరంగ ప్రదేశంలో నిలిపి ఉంచారు. ఈ సమయంలో వాటికి నిప్పంటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఇంకా గుర్తించలేదని, ట్రక్కులకు ఎందుకు నిప్పుపెట్టారో స్పష్టంగా తెలియదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మణిపూర్ లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చినవి మినహా అన్ని ప్లాట్ ఫామ్ లు, అన్ని సర్వీస్ ప్రొవైడర్లలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. అధికారులు ఆమోదించిన కేస్-టు-కేస్ ప్రాతిపదికన ఇంటర్నెట్ లీజ్ లైన్ (ఐఎల్ఎల్) వినియోగదారులను కూడా నిషేధం నుండి మినహాయించారు.
Read also: Anganwadi Jobs : అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు.. పది పాసైన వాళ్ళు అర్హులు..
మే 3న మీటీలను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ కు నిరసనగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్ యూ) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో హింస చెలరేగింది. మెయిటీ, కుకి వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులు – నాగాలు, కుకిలు – జనాభాలో మరో 40 శాతం మంది ఉన్నారు. వారు కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు. ఈ రెండు జాతుల మధ్య వైరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!