Lok Sabha Elections: చరిత్రలో తొలిసారి.. అతి తక్కువ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections: స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ అతి తక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇండియా కూటమి సీట్ల షేరింగ్లో భాగంగా ఇతర పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తాను తక్కువ స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ, కేవలం దాదాపుగా 300 స్థానాలకు అటుఇటుగా పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ ఈసారి కూటమిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 2019లో 421, 2014లో 464, 2009లో 440, 2004లో 417 స్థానాల్లో పోటీ చేసింది. ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇంత తక్కువ సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ ప్రధాన విరోధి అయిన బీజేపీ పార్టీ 432 సీట్లలో తమ అభ్యర్థులను నిలిపింది. గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. 2019లో 52 సీట్లు, 2014లో 44 సీట్లకు పరిమితమైంది. అంతకుముందు 2009లో 206, 2004లో 145 స్థానాలు గెలిచి యూపీఏ కూటమి నేతృత్వంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది.
Also Read
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
- Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..

Read Also: Sanjay Singh : ప్రధాని పిలుపు మేరకే జైల్లోనే కేజ్రీవాల్ హత్యకు కుట్ర : ఆప్ ఆరోపణ
ఈ సారి ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఆలోచనతోనే, పొత్తు ధర్మాన్ని పాటించి తక్కువ సీట్లకు పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ సమర్ధించుకుంటోంది. దేశంలో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కేవలం మైనర్ పార్టీగానే కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు దక్కాయి. ఎన్సీపీ-శివసేన(ఉద్ధవ్), సమాజ్వాదీ(ఎస్పీ)తో పొత్తుతో తాము తక్కువ సీట్లకే పరిమితమైనట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి జైరాం రమేష్ అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 201 స్థానాలు ఉన్నాయి. అయితే, ఈ రాష్ట్రాల్లో మిత్రపక్షాలకే గణనీయమైన సీట్లు దక్కాయి. దీంతో కాంగ్రెస్ తక్కవ సీట్లకు పరిమితమైంది. మహారాష్ట్రలో 48 ఏంపీ స్థానాలకు గానూ కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇదే విధంగా యూపీలో 80 స్థానాల్లో 17, బీహార్లో 40 స్థానాల్లో 09, తమిళనాడులో 39 స్థానాల్లో 09 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు 42 స్థానాలకు గానూ 13 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఆరు సీట్లు వదులుకుంది.
తాజావార్తలు
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?