Dil Raju: షూటింగ్స్ ఆపేశాం.. నాలుగు కమిటీలు పని చేస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Four Committees Held To Solve Industry Problems Says Dil Raju: టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేసినా, తన ‘వరిసు’ సినిమా చిత్రీకరణను కొనసాగించడంతో నిర్మాత దిల్రాజుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు నిర్మాతల మధ్యే విభేదాలు తలెత్తాయంటూ ప్రచారాలు జరిగాయి. వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ. కళ్యాణ్ కొట్టిపారేశారు. తమ మధ్య విభేదాలు లేవని, దిల్రాజుని కార్నర్ చేసి మాట్లాడటం సరికాదని, ఆయన సమయాన్ని పూర్తి స్థాయిలో వెచ్చిస్తున్నానన్నారు. ఇదే సమయంలో దిల్ రాజు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం మొత్తం నాలుగు కమిటీలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
థియేటర్లలో సినిమాల్ని విడుదల చేసిన తర్వాత.. ఎన్ని వారాలకు ఓటీటీకు వెళ్తే మంచిదన్న విషయంపై వర్క్ చేసేందుకు ఒక కమిటీ వేశామన్నారు. రెండవది.. థియేటర్స్లో వీపీఎఫ్ ఛార్జీల పర్సెంటెంజ్లు ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తున్నాయన్నారు. ఆ కమిటీ ఎగ్జిబిటర్స్తో చర్చిస్తుందని తెలిపారు. మూడవది.. ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండిషన్స్పై నివేదిక తయారు చేస్తోందని పేర్కొన్నారు. ఇక నాల్గవది.. నిర్మాతలకు ప్రొడక్షన్లో వేస్టేజ్, వర్కింగ్ కండిషన్స్, ఎన్ని గంటలపాటు షూటింగ్స్ జరగాలన్న విషయాలను పరిశీలిస్తోందన్నారు. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలోనే ఈ నాలుగు కమిటీలు వేయడం జరిగిందని, ఈ కమిటీలు చాలా హోమ్ వర్క్ చేస్తున్నాయని దిల్ రాజు వెల్లడించారు.
Also Read
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
- Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన 'రాజా శివాజీ'.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
సోషల్ మీడియాలో ఏవేవో వార్తలు రాస్తున్నారని, వాటిని నమ్మొద్దని దిల్ రాజు కోరారు. తమకు ఫిలిం ఛాంబర్ ఒక్కటే ఫైనల్ అన్నారు. నెలల తరబడి షూటింగ్ ఆపాలన్న ఉద్దేశం తమకు లేదని, నిర్మాతలకు భారం కాకుండా త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గత మూడు రోజుల నుంచి నాలుగు మీటింగ్స్ జరిగాయని, తెలుగు సినిమా ఎలా ఉండాలన్న దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే రిజల్ట్ వస్తుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!