Dil Raju: షూటింగ్స్ ఆపేశాం.. నాలుగు కమిటీలు పని చేస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Four Committees Held To Solve Industry Problems Says Dil Raju: టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేసినా, తన ‘వరిసు’ సినిమా చిత్రీకరణను కొనసాగించడంతో నిర్మాత దిల్రాజుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు నిర్మాతల మధ్యే విభేదాలు తలెత్తాయంటూ ప్రచారాలు జరిగాయి. వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ. కళ్యాణ్ కొట్టిపారేశారు. తమ మధ్య విభేదాలు లేవని, దిల్రాజుని కార్నర్ చేసి మాట్లాడటం సరికాదని, ఆయన సమయాన్ని పూర్తి స్థాయిలో వెచ్చిస్తున్నానన్నారు. ఇదే సమయంలో దిల్ రాజు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం మొత్తం నాలుగు కమిటీలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
థియేటర్లలో సినిమాల్ని విడుదల చేసిన తర్వాత.. ఎన్ని వారాలకు ఓటీటీకు వెళ్తే మంచిదన్న విషయంపై వర్క్ చేసేందుకు ఒక కమిటీ వేశామన్నారు. రెండవది.. థియేటర్స్లో వీపీఎఫ్ ఛార్జీల పర్సెంటెంజ్లు ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తున్నాయన్నారు. ఆ కమిటీ ఎగ్జిబిటర్స్తో చర్చిస్తుందని తెలిపారు. మూడవది.. ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండిషన్స్పై నివేదిక తయారు చేస్తోందని పేర్కొన్నారు. ఇక నాల్గవది.. నిర్మాతలకు ప్రొడక్షన్లో వేస్టేజ్, వర్కింగ్ కండిషన్స్, ఎన్ని గంటలపాటు షూటింగ్స్ జరగాలన్న విషయాలను పరిశీలిస్తోందన్నారు. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలోనే ఈ నాలుగు కమిటీలు వేయడం జరిగిందని, ఈ కమిటీలు చాలా హోమ్ వర్క్ చేస్తున్నాయని దిల్ రాజు వెల్లడించారు.
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
సోషల్ మీడియాలో ఏవేవో వార్తలు రాస్తున్నారని, వాటిని నమ్మొద్దని దిల్ రాజు కోరారు. తమకు ఫిలిం ఛాంబర్ ఒక్కటే ఫైనల్ అన్నారు. నెలల తరబడి షూటింగ్ ఆపాలన్న ఉద్దేశం తమకు లేదని, నిర్మాతలకు భారం కాకుండా త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గత మూడు రోజుల నుంచి నాలుగు మీటింగ్స్ జరిగాయని, తెలుగు సినిమా ఎలా ఉండాలన్న దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే రిజల్ట్ వస్తుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!