Raghubabu: కన్నప్ప సినిమా ట్రోల్ చేశారంటే.. రఘుబాబు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రాల్లో “కన్నప్ప” ఒకటి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కొంతమంది ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో, నటుడు రఘుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ సినిమాను రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్ లో ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో రఘుబాబు మాట్లాడుతూ “కన్నప్ప సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా ఇప్పుడే.. శివుని ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తు పెట్టుకోండి. ఎవరైనా 100 శాతం కరెక్ట్ ఇది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఫినిష్.” అని అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినీ అభిమానుల్లో హాట్ టాపిక్గా మారాయి.
MLC Kavitha : ఎంఎంటీఎస్ రైలు ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
“కన్నప్ప” సినిమా శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలో ముఖ్యమైన భాగమైన భక్త కన్నప్ప కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమాలో విష్ణు మంచుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పోస్టర్లు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ చిత్రం ఏప్రిల్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘుబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కొందరికి హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ, మరికొందరు దీనిని సీరియస్గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది సర్వసాధారణంగా మారిన ఈ రోజుల్లో, రఘుబాబు తన వ్యాఖ్యలతో ట్రోలర్లను హెచ్చరించే ప్రయత్నం చేశారు. కొందరు నెటిజన్లు “ఇది కేవలం సినిమా ప్రమోషన్ కోసం చేసిన వ్యాఖ్యే” అని అభిప్రాయపడుతుండగా, మరికొందరు “అసలు ట్రోలింగ్కు శాపాలు ఎందుకు?” అని ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!