Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 సెన్సేషనల్ బుకింగ్స్..డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన కాంతార చాప్టర్ వన్ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రోజు ముందుగానే, అంటే అక్టోబర్ 1న ప్రీమియర్ షోలతో స్క్రీనింగ్స్ ఆరంభమైన ఈ చిత్రం, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. కాంతార మొదటి భాగం సృష్టించిన సంచలనం తర్వాత, ఈ సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను కాంతార చాప్టర్ వన్ అన్ని విధాలుగా అందుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రేక్షకులు ఈ సినిమాను ‘డివైన్ బ్లాక్బస్టర్’గా కొనియాడుతూ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో, మొదటి రోజు కలెక్షన్స్ భారీగా నమోదై, అధికారిక ప్రకటన ప్రకారం సుమారు 89 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ లెక్కన కాంతార చాప్టర్ వన్ 2025లో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలవడం ఖాయం.
Also Read : Tollywood Actress : లక్కీ హీరోయిన్ చేతిలో 8 సినిమాలు..అన్ని బడా సినిమాలే
Also Read
- Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
- Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
- Peddi Inside Talk : 'పెద్ది' ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
- Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను ఏ స్థాయిలో అందుకుందంటే, ఒక్క బుక్ మై షో యాప్లోనే రిలీజ్ రోజున 1.28 మిలియన్కు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఇతర ఆన్లైన్ బుకింగ్ యాప్లతో పాటు ఆఫ్లైన్ బుకింగ్లను కలుపుకుంటే, మొదటి రోజు కలెక్షన్స్ సెన్సేషనల్ రికార్డ్ను నమోదు చేసినట్లు తెలుస్తోంది. రెండవ రోజు కూడా ఈ జోరు కొనసాగుతోంది. గంటకు 70 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయంటే, కాంతార చాప్టర్ వన్ ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Also Read :Akshay Kumar: నా కూతురు న్యూడ్ పిక్స్ అడిగాడు.. అక్షయ్ కుమార్ సంచలనం
రిషబ్ శెట్టి నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉందని, కథను నడిపించిన తీరు నెక్స్ట్ లెవెల్లో ఉందని ప్రేక్షకులు, విమర్శకులు కొనియాడుతున్నారు. ఈ చిత్రాన్ని కన్నడ భాషలో రూపొందించి, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించి, సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్పై ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. రిషబ్ శెట్టి దర్శకత్వ ప్రతిభ, నటనా నైపుణ్యం, హొంబాలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు, బలమైన కథాంశం కలిసి ఈ సినిమాను 2025లో ఒక ల్యాండ్మార్క్ చిత్రంగా నిలిపాయి. ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
-
ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
-
Purity of Wheat Floor: మీరు వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదేనా? ఈ 3 చిట్కాలతో వెంటనే తెలుసుకోవచ్చు!
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!