భారీ బడ్జెట్ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శనపై ఓ క్లారిటీకి వచ్చింది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని; పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలానే టిక్కెట్ రేట్లను తమ ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతున్నారని, దానికి జీఎస్టీ ని కూడా వారు చెల్లించడం లేదని నాని అసెంబ్లీలో ఆరోపించారు. వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసమే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోందని చెప్పారు. ఈ విధానాన్ని ఏ నిర్మాత విమర్శించడంలేదని, కేవలం కొన్ని రాజకీయ పార్టీలే దీనిపై బురద చల్లుతున్నాయని అన్నారు. బీద వారికి ఏకైక వినోదసాధనంగా ఉన్న సినిమాను సరసమైన ధరకు అందించడమే ప్రభుత్వం కర్తవ్యమని, గతంలో థియేటర్ కౌంటర్ల దగ్గర కొద్ది టిక్కెట్లు అమ్మి, హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టి, ఆ పైన బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేవారని, అలాంటి వాటికి ఈ ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంతో చెక్ పెడతామని తెలిపారు.
పెద్ద సినిమాలకు ఇక కష్టమే!
Also Read
- Gatta Kusthi 2: "విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది".. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
- "Aadarsha Kutumbam" కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
- Pawan Kalyan: "ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!".. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
- Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు షాక్ తగిలినట్టే. ఎందుకంటే కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు తొలి వారం రోజులలోనే తమ పెట్టుబడి తిరిగి రావాలని కోరుకుంటారు. అలా జరగని పక్షంలో సినిమా పైరసీకి గురై, ధియేటర్లకు జనం రాని పరిస్థితి ఏర్పడుతుంది. అలానే మూవీ రిలీజ్ అయిన తర్వాత నెగెటివ్ టాక్ వచ్చినా… జనం థియేటర్లకు రారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే భారీ చిత్రాల నిర్మాతలు అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేయడం, తమ బడ్జెట్ కు తగ్గట్టుగా టిక్కెట్ రేట్లను పెంచి అమ్మడం చేస్తుంటారు. అయితే ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తూ కూడా ఆటలపై ఆంక్షలు పెట్టడం, టిక్కెట్ రేట్లను నియంత్రించాలని అనుకోవడం సమజసం కాదని కొందరు అంటున్నారు.
సినిమా టిక్కెటింగ్ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత కూడా ఇలా ఆటలపై, టిక్కెట్ రేట్లపై ఆకాంక్షలు విధిస్తే పెద్ద సినిమా నిర్మాతలకు తీరని నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ దెబ్బ డిసెంబర్ 2న విడుదల కాబోతున్న నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మీద మొదట పడబోతోంది. ఇదే పద్థతిని అనుసరిస్తే, సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే పెద్ద సినిమాలకు భారీ నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. మరి ప్రభుత్వం ఆటలు, టిక్కెట్ రేట్ల విషయంలో పునరాలోచన చేస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
-
Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన ‘గోల్డెన్’ స్కెచ్!
-
Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!