Cough: దగ్గుతో బాధ పడుతున్న వాళ్లు ఇవి అస్సలు తినొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సీజన్లను బట్టి కొన్న రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తే.. ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒకటి రెండు సార్లు అయినా పొడి దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది సాధారణంగా వచ్చే సమస్య. కాని దానికి దూరం చేసుకునేందుకు కొన్ని సూత్రాలు పాటించాలని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. దగ్గు ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. చాలా మంది దగ్గుకు సిరప్ లు వాడుతూ.. తినకూడని ఆహార పదార్థాలు తింటుంటారు. దీంతో దగ్గు తగ్గక పోగా.. పెరిగే అవకాశం ఉంటుంది.
READ MORE:CM YS Jagan: మేనిఫెస్టో అంటే ఒక చెత్త ముక్క కాదు.. పవిత్ర గ్రంథం..
Also Read
- Psychology Facts: 'లైట్ తీసుకో, పట్టించుకోకు..' ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
దగ్గుతో బాధపడుతున్న వాళ్లు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. దగ్గు అధికంగా ఉన్నప్పుడు ఉప్పు అధికంగా వేసిన ఆహారాలను దూరం పెట్టండి. నూనె అధికంగా ఉన్న, నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినకూడదు. ఉదాహరణకు పూరీలు, గారెలు వంటివి. పంచదారతో కూడిన ఆహార పదార్థాలను సైతం అవాయిడ్ చేయాలి. ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఏదైనా జబ్బు త్వరగా తగ్గలంటే రోగనిరోధక శక్తి తప్పనిసరి. పైన వివరించిన ఆహార పదార్థాలను దగ్గుతో బాధ పడుతున్న వాళ్లు తింటే.. కఫం అధికంగా ఉత్పత్తి అవుతుంది. అలాగే దగ్గు ఉన్నప్పుడు బెల్లంతో చేసిన ఆహారాలు, చల్లగా ఉండే నీరు, పెరుగు వంటివి కూడా తినడం మానేయాలి. అలాగే పండ్ల రసాలను దూరంగా పెట్టాలి. చల్లగా ఉండే పండ్ల రసాలు దగ్గును పెంచేస్తాయి. పరగడుపున గోరువెచ్చగా ఉన్న నీటిలో తేనె కలుపుకొని తాగితే చాలా మంచిది. ఒకవేళ పండ్ల రసాలు తాగినా కూడా చల్లగా కాకుండా, గది ఉష్ణోగ్రత వద్ద ఉండేట్టు చూసుకోవాలి. తేనె మాత్రం వేసుకొని తాగితే ఎంతో మంచిది.
రాత్రి అవుతున్న కొద్దీ దగ్గు మరింతగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఉడికించిన ఆహార పదార్థాలను తినాలి. నూనెకు బదులు నీళ్లు పోసి వండిన కూరలు, అన్నం వంటివి తింటే మంచిది. అలాగే మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. పండ్లను తినడం వల్ల మేలు జరుగుతుంది. కానీ సాయంత్రం ఏడు గంటలలోపే పండ్లను తినడం మంచిది. అది కూడా చల్లగా ఉన్న పండ్లను తినకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న వంటలను మాత్రమే ఎంపిక చేసుకొని తినాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే దగ్గు నుంచి త్వరగా ఉపశమణం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నూనె అధికంగా ఉన్న పదార్థాల జోలికి వెళ్లకూడదు.
- Tags
- avoid curd
- Cough
- doctors
- life style
తాజావార్తలు
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!