Cough: దగ్గుతో బాధ పడుతున్న వాళ్లు ఇవి అస్సలు తినొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సీజన్లను బట్టి కొన్న రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తే.. ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒకటి రెండు సార్లు అయినా పొడి దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది సాధారణంగా వచ్చే సమస్య. కాని దానికి దూరం చేసుకునేందుకు కొన్ని సూత్రాలు పాటించాలని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. దగ్గు ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. చాలా మంది దగ్గుకు సిరప్ లు వాడుతూ.. తినకూడని ఆహార పదార్థాలు తింటుంటారు. దీంతో దగ్గు తగ్గక పోగా.. పెరిగే అవకాశం ఉంటుంది.
READ MORE:CM YS Jagan: మేనిఫెస్టో అంటే ఒక చెత్త ముక్క కాదు.. పవిత్ర గ్రంథం..
Also Read
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
- Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ 'చింతపండు ఉల్లిపాయ చట్నీ' ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
- High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
- Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
దగ్గుతో బాధపడుతున్న వాళ్లు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. దగ్గు అధికంగా ఉన్నప్పుడు ఉప్పు అధికంగా వేసిన ఆహారాలను దూరం పెట్టండి. నూనె అధికంగా ఉన్న, నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినకూడదు. ఉదాహరణకు పూరీలు, గారెలు వంటివి. పంచదారతో కూడిన ఆహార పదార్థాలను సైతం అవాయిడ్ చేయాలి. ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఏదైనా జబ్బు త్వరగా తగ్గలంటే రోగనిరోధక శక్తి తప్పనిసరి. పైన వివరించిన ఆహార పదార్థాలను దగ్గుతో బాధ పడుతున్న వాళ్లు తింటే.. కఫం అధికంగా ఉత్పత్తి అవుతుంది. అలాగే దగ్గు ఉన్నప్పుడు బెల్లంతో చేసిన ఆహారాలు, చల్లగా ఉండే నీరు, పెరుగు వంటివి కూడా తినడం మానేయాలి. అలాగే పండ్ల రసాలను దూరంగా పెట్టాలి. చల్లగా ఉండే పండ్ల రసాలు దగ్గును పెంచేస్తాయి. పరగడుపున గోరువెచ్చగా ఉన్న నీటిలో తేనె కలుపుకొని తాగితే చాలా మంచిది. ఒకవేళ పండ్ల రసాలు తాగినా కూడా చల్లగా కాకుండా, గది ఉష్ణోగ్రత వద్ద ఉండేట్టు చూసుకోవాలి. తేనె మాత్రం వేసుకొని తాగితే ఎంతో మంచిది.
రాత్రి అవుతున్న కొద్దీ దగ్గు మరింతగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఉడికించిన ఆహార పదార్థాలను తినాలి. నూనెకు బదులు నీళ్లు పోసి వండిన కూరలు, అన్నం వంటివి తింటే మంచిది. అలాగే మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. పండ్లను తినడం వల్ల మేలు జరుగుతుంది. కానీ సాయంత్రం ఏడు గంటలలోపే పండ్లను తినడం మంచిది. అది కూడా చల్లగా ఉన్న పండ్లను తినకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న వంటలను మాత్రమే ఎంపిక చేసుకొని తినాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే దగ్గు నుంచి త్వరగా ఉపశమణం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నూనె అధికంగా ఉన్న పదార్థాల జోలికి వెళ్లకూడదు.
- Tags
- avoid curd
- Cough
- doctors
- life style
తాజావార్తలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!