ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మనం పిండి పదార్థాలు (Carbs), ప్రోటీన్ల గురించి ఎంతగానో చర్చిస్తాం కానీ, వంటల్లో వాడే నూనె మోతాదు గురించి పెద్దగా పట్టించుకోం. అయితే, మనం ప్రతిరోజూ తీసుకునే నూనె మన గుండె , కాలేయ (Liver) ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనిపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక అవగాహన వీడియోను విడుదల చేసింది. నూనె వినియోగంపై ఆసక్తికరమైన,…
భారతీయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమే కాకుండా విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి పోషకాలతో నిండి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెయ్యి వల్ల కలుగుతాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో కల్తీ నెయ్యి విచ్చలవిడిగా లభిస్తోంది. చౌక రకపు నూనెలు, వనస్పతి లేదా జంతువుల కొవ్వును కలిపి నెయ్యిని తయారు చేస్తున్నారు. మరి మీరు కొన్న నెయ్యి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి…
FSSAI: ఛాయ్.. చాలామందికి ఉదయాన్నే దీనిని తాగితే కాని రోజు మొదలవ్వద్దు. అయితే తాజాగా భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) ఈ ఛాయ్ విషయంలో ఓ కీలకమైన స్పష్టీకరణ ఇచ్చింది. ‘ఛాయ్’ అనే పేరు కేవలం కామెల్లియా సినెన్సిస్ (Camellia sinensis) మొక్కతో తయారైన ఉత్పత్తులకే వర్తిస్తుందని పేర్కొంది. హెర్బల్ టీ, రూయిబోస్ టీ, ఫ్లవర్ టీ వంటి పానీయాలను ‘ఛాయ్’గా పిలవడం తప్పుదారి పట్టించే ప్రకటన (మిస్ బ్రాండింగ్)గా పరిగణిస్తామని FSSAI…
గుడ్లను క్యాన్సర్ ప్రమాదంతో ముడిపెడుతున్న ఇటీవలి వాదనలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొట్టిపారేసింది. అటువంటి ప్రచారాలు తప్పుదారి పట్టించేవి, శాస్త్రీయంగా నిరాధారమైనవి, అనవసరంగా ఆందోళన కలిగించేవి అని పేర్కొంది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఆహార భద్రతా నియంత్రణ సంస్థ దేశంలో లభించే గుడ్లు తినడానికి సురక్షితమైనవని, గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని ఆరోపించే నివేదికలకు శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది. భారత్ లో విక్రయించే…
పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్లను పిల్లలు, పెద్దలు తినాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల కల్తీ భయందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది. గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్ ఉందో లేదో తనిఖీ చేయడానికి దేశవ్యాప్తంగా శాంపిల్స్ సేకరించాలని FSSAI…
ఓఆర్ఎస్ పేరుతో విక్రయించే అన్ని పండ్ల ఆధారిత డ్రింక్స్, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్, రెడీ-టు-సర్వ్ పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్లను మార్కెట్లు, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే తొలగించాలని భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల అథారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. చాలా కంపెనీలు తమ పండ్ల రసాలను లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను ‘ORS’ పేరుతో అమ్మడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇవి నిజమైన ఓరల్ రీహైడ్రేషన్ పరిష్కారాలు కావు అని నిపుణులు…
ప్రముఖ స్వీట్ షాపులో అయితే ఎలాంటి కల్తీ ఉండదు.. నాసిరకం ఉండదని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా కల్తీ జరుగుతుందని విషయం ఇప్పుడు బయటపడింది.. ఎందుకంటే ప్రముఖ స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నా తయారీ కేంద్రం పైన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ సోదాల్లో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. మల్లాపూర్ లోని అమన్ స్వీట్స్ తయారీ కేంద్రం పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. భయంకరమైన నిజాలతో వెంటనే…
Baba Ramdev : బాబా రామ్దేవ్కి చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్కి చెందిన ఎర్ర కారం పొడిలో లోపాలు కనుగొనబడిన నేపథ్యంలో, ఆహార భద్రతా సంస్థ FSSAI సూచనలను అనుసరించి, కంపెనీ తన మార్కెట్లోని నాలుగు టన్నుల ఎర్ర కారం పొడిని రీకాల్ చేయాలని నిర్ణయించింది.
విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి '5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేట్ పొందింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి ప్రతిష్టాత్మకమైన 'ఈట్ రైట్ స్టేషన్' ధృవీకరణను పొందింది.