Vijayawada: ఇంద్రకీలాద్రిపై కలకలం.. నకిలీ పత్రాలతో అర్చక ఉద్యోగానికి యత్నం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో నకిలీ పత్రాల సృష్టించి అర్చక ఉద్యోగం పొందేందుకు జరిగిన ఒక కుట్ర వెలుగులోకి వచ్చింది. దేవాదాయ శాఖ అధికారుల కళ్లు గప్పి, ఏకంగా అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చుకున్న ఒక వ్యక్తి ఉదంతం ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై సంచలనంగా మారింది.
Yashasvi Jaiswal: ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్.. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది!
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
ఘటన సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. 2022లో సాయిబాబు అనే అర్చకుడు మరణించారు. ఆయన మరణానంతరం ఆ ఖాళీ అయిన అర్చక పోస్టును దక్కించుకోవాలని దిలీప్ దత్తార అనే వ్యక్తి పన్నాగం పన్నాడు. తాను సాయిబాబు దత్తపుత్రుడినని నమ్మించేలా నకిలీ పత్రాలను సృష్టించి, దేవాలయ అధికారులను బోల్తా కొట్టించాడు. ఈ పత్రాల ఆధారంగా ఏకంగా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి నియామక ఉత్తర్వులు (Appointment Order) కూడా పొందడం గమనార్హం.
దిలీప్ ఇలాంటి మోసానికి పాల్పడటం ఇది మొదటిసారి కాదు. 2009లో నామయ్య అనే అర్చకుడు మరణించినప్పుడు కూడా, ఆయన స్థానంలో ఉద్యోగం పొందేందుకు దిలీప్ ప్రయత్నించాడు. అయితే, తాజాగా సాయిబాబు మరణం తర్వాత మరోసారి నకిలీ పత్రాలతో రంగంలోకి దిగి అధికారులను పక్కదారి పట్టించాడు. దిలీప్ చేస్తున్న ఈ మోసాన్ని గమనించిన అతని సొంత పెదనాన్న కుమార్తె (2009లో చనిపోయిన నామయ్య పెద్ద కుమార్తె) కోడూరు లక్ష్మీ పద్మావతి ఆలయ ఈవో శీనా నాయక్కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. నిందితుడు తప్పుడు పత్రాలతో అధికారులను మోసం చేస్తున్నాడని ఆమె ఆధారాలతో సహా వివరించారు. దీంతో అప్రమత్తమైన ఈవో, ఆ నియామక ప్రక్రియను వెంటనే నిలిపివేసి విచారణకు ఆదేశించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఎంత నిర్లక్ష్యంగా సాగుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. కనీస విచారణ లేకుండా నకిలీ పత్రాలకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎలా ఇచ్చారనే దానిపై తోటి అర్చకులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపి, ఈ కుట్రలో ఎవరి పాత్ర ఉందో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దేవాదాయ శాఖ విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!