వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తారు. అయితే, లాభాల కోసం కొంతమంది వ్యాపారులు ‘కాల్షియం కార్బైడ్’ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి మామిడి పండ్లను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇటువంటి పండ్లను తినడం వల్ల క్యాన్సర్, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో, మనం కొనే పండ్లు సహజంగా పండినవో కాదో గుర్తించడానికి FSSAI కొన్ని సులభమైన మార్గాలను సూచించింది. Bobby : “ఆయన…
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్లో వెలుగుచూసిన కుళ్లిన బిర్యానీ ఉదంతం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ‘లక్కీ బిర్యానీ షవర్మాస్’ అనే రెస్టారెంట్ బాగోతాన్ని బంజారాహిల్స్ పోలీసులు రట్టు చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టూలోని వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఒక ఆన్లైన్ ఫుడ్ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ అయిన ప్యాకెట్ తెరవగానే అందులో…
చాలామంది వారం లేదా పది రోజులకు సరిపడా మాంసాన్ని ఒకేసారి కొనుగోలు చేసి రిఫ్రిజిరేటర్లో పెడుతుంటారు. కానీ, మాంసం పచ్చిగా ఉన్నప్పుడు అందులో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి, మాంసాన్ని నిల్వ చేసేటప్పుడు కొన్ని ప్రాథమిక నియమాలను పాటించడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు? పచ్చి చికెన్/మటన్: సాధారణ రిఫ్రిజిరేటర్ (Chiller) , ఫ్రీజర్ (Freezer)…
Summer Kitchen Tips in Telugu : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల వండిన అన్నం చాలా త్వరగా పాడైపోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం వండిన అన్నం రాత్రి వరకు కూడా ఉండకుండా పులిసిపోవడం లేదా వాసన రావడం జరుగుతుంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా అన్నం ఎక్కువ సేపు తాజాగా ఉండటానికి ఈ క్రింది చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు: 1. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతే మూత పెట్టండి చాలామంది అన్నం వండగానే వెంటనే…
Plastic Rice Tips : ఆహార పదార్థాల కల్తీ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, మనం నిత్యం తినే బియ్యం కూడా కల్తీకి గురవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ప్లాస్టిక్ బియ్యం లేదా తక్కువ నాణ్యత గల బియ్యం మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈ నేపథ్యంలో డాక్టర్ వినోద్ శర్మ బియ్యంలో కల్తీని గుర్తించడానికి కొన్ని ప్రభావవంతమైన చిట్కాలను పంచుకున్నారు. నీటి పరీక్ష (Water Test) బియ్యంలో కల్తీని గుర్తించడానికి ఇది…
Adulterated Milk: తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలైన వారికి వైద్య పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో పాలనను మరింత పారదర్శకంగా, టెక్నాలజీ ఆధారితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేశారు. అధికారులతో నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో ఆయన నగర అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం , భద్రతపై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హోటళ్లలో ఫుడ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి హోటల్ కిచెన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటిని నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశించారు. దీనివల్ల…
గుడ్లను క్యాన్సర్ ప్రమాదంతో ముడిపెడుతున్న ఇటీవలి వాదనలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొట్టిపారేసింది. అటువంటి ప్రచారాలు తప్పుదారి పట్టించేవి, శాస్త్రీయంగా నిరాధారమైనవి, అనవసరంగా ఆందోళన కలిగించేవి అని పేర్కొంది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఆహార భద్రతా నియంత్రణ సంస్థ దేశంలో లభించే గుడ్లు తినడానికి సురక్షితమైనవని, గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని ఆరోపించే నివేదికలకు శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది. భారత్ లో విక్రయించే…
పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్లను పిల్లలు, పెద్దలు తినాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల కల్తీ భయందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది. గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్ ఉందో లేదో తనిఖీ చేయడానికి దేశవ్యాప్తంగా శాంపిల్స్ సేకరించాలని FSSAI…
Food poisoning: పశ్చిమ బెంగాల్లోని తూర్పు బుర్ద్వాన్ లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపుగా 100 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వీరంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అన్స్గ్రామ్ లోని పిచ్కురి నవాబియా మదర్సాలో జరిగింది. శనివారం ఉదయం దాదాపు 7-8 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. ఆ తర్వాత గంట గంటలకు బాధిత విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది.