Acidity: కడుపులో మంటగా ఉందా? ఈ చిట్కాలు పాటించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acidity: అసిడిటీ ఎవరినీ ప్రశాంతంగా ఉంచదు. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత గుండెల్లో మంట, చికాకు, ఇలా గుండెల్లో మంట ఉంటే అది ఖచ్చతంగా ఎసిడిటీనే. జీర్ణవ్యవస్థ సరిగా లేకుంటే కడుపు మంటగా అనిపిస్తుంది. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మంట ఏమీ తిననివ్వదు.. తింటే సహించదు. అయితే, ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది కడుపు మంటను తగ్గించడానికి లేనిపోని టాబ్లెట్లు, సిరప్లను ఉపయోగిస్తారు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినవైతే పర్వాలేదు కానీ.. మందుల షాపులో అడిగి ఏదైనా కొని వాడుకోవడం సరికాదు. అంతేకాదు.. ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందేందుకు చాలా హోం రెమెడీస్ ఉన్నాయి. దీని నుంచి బయట పడటానికి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Read also: Nandakumar Released: జైలు నుంచి విడుదలైన నందకుమార్.. షరతులతో కూడిన బెయిల్
Also Read
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
- Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
ఇలా చేస్తే తక్షణ ఉపశమనం..
* ఒక కప్పు గోరు నీటిలో కొద్దిగా వాము పొడి, కొద్దిగా నల్ల ఉప్పు కలిపి తీసుకోవచ్చు. దీన్ని రోజుకు రెండుసార్లు తాగితే కడుపు మంట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
* రెండు టీస్పూన్ల తేనెను గోరువచ్చని నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకుంటే గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనె సహజసిద్ధమైన యాంటాసిడ్గా పనిచేస్తుంది. ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది.
Read also: Bet Hens: ఉడుతలపల్లి కోడి ధర రూ.70 వేలకు పైనే.. బరిలోకి దిగాయంటే..
* ఒక గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల జీలకర్ర వేసి పది నిమిషాలు మరిగించి, వడకట్టి చల్లారాక తాగాలి. ఈ నీటిని ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపు మంట తగ్గుతుంది.
* రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు చల్లని పాలు తాగాలి. పాలను బాగా మరిగించి చల్లార్చి కాసేపు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఆతరువాత వాటిని నిద్రించడానికి కొన్ని నిమిషాల ముందు తీసుకోవాలి. ఇలా వరుసగా మూడు రోజులు చేస్తే ఎసిడిటీ తగ్గుతుంది.
* ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు గుప్పెడు సోంపును నోట్లో వేసుకుని నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కడుపులో మంట నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
Inavolu Mallanna Jatara: నేటి నుంచి మైలారు దేవుడి బ్రహ్మోత్సవాలు.. పెటెత్తిన భక్తులు
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!