Inavolu Mallanna Jatara: నేటి నుంచి మైలారు దేవుడి బ్రహ్మోత్సవాలు.. పెటెత్తిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inavolu Mallanna Jatara: వరంగల్ జిల్లాలో నేటి నుంచి ఐనవోలు జాతర మొదలు కానుంది. ఐనవోలు మల్లిఖార్జున స్వామికి అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధం చేసిన అర్చకులు. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో మొదలవున్నాయి. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు కొనసాగనున్నాయి. ధ్వజారోహణ రోజు స్వామివారికి నూతన వస్త్రాలంకరణతోపాటు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవానికి చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఇక్కడ మహాశివుడి రూపాల్లో మల్లికార్జున స్వరూపం ఒకటి. శ్రీశైలం మల్లికార్జునుడు సహా పలు క్షేత్రాల్లో పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. కానీ, ఇక్కడ విగ్రహం రూపంలో దర్శనమిస్తాడు. దీంతో.. మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేలు రాయుడు పిలుచుకునే.. మైలారుదేవుడి రూపం పది అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, కోరమీసాలతో అలరారుతుంది. నాలుగు చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు.. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. అంతేకాకుండా.. కుడి పాదం కింద, మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి మల్లాసురుల శిరస్సులు ఉంటాయి. అయితే.. ఈ ఆలయానికి 1100 ఏళ్ల చరిత్రతో అంతకుమించిన విశిష్టమైన కళా సంపద ఆలయం సొంతం. ఇక్కడి అష్టోత్తర స్తంభాలు, కాకతీయ కళా సంపద కీర్తితోరణలతో గ్రామం స్వాగతం పలుకుతుంది. పుట్టుమన్నుతో పూజలు మల్లికార్జునస్వామి పూజలందుకుంటారు.
Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
అయితే.. సంక్రాంతికి ముందు నుంచి ఉగాది వరు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. బ్రహ్మోత్సవాల వేడుకల సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఒగ్గు కథలతో, శివసత్తుల పూనకాలు, పట్నాలు, బోనాలతో సందడిగా కనిపిస్తుంది. జనవరి 14న శనివారం భోగి పండుగ, 15న ఆదివారం మకర సంక్రాంతి బండ్లు తిరుగుట, ఇక.. 17న మహా సంప్రోక్ష సమారాధన పూజలు జరుగనున్నాయి. జనవరి 26న భ్రమరాంబ అమ్మవారి నవమి వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న ఆదివారం ఎల్లమ్మ పండుగ జరుగనున్నది. శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి మార్చి 22 వరకు పంచాహ్నిక దీక్షతో త్రికుండాత్మకంగా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా పలు వాహనసేవలు నిర్వహించనున్నారు. 18న శనివారం శివరాత్రి రోజున కల్యాణం, పెద్దపట్నం, సింహవాహనసేవ, రాత్రి 7 గంటలకు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కల్యాణం జరుగనున్నది. వరంగల్ నుంచి ఐనవోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాఫీగా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు అందుబాటులో వుండేలా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు.
Warangal Crime: మద్యం మత్తులో యువకుల హల్చల్.. అర్ధరాత్రి రోడ్డుపైనే చితకొట్టుకున్న..
తాజావార్తలు
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!