Inavolu Mallanna Jatara: నేటి నుంచి మైలారు దేవుడి బ్రహ్మోత్సవాలు.. పెటెత్తిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inavolu Mallanna Jatara: వరంగల్ జిల్లాలో నేటి నుంచి ఐనవోలు జాతర మొదలు కానుంది. ఐనవోలు మల్లిఖార్జున స్వామికి అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధం చేసిన అర్చకులు. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో మొదలవున్నాయి. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు కొనసాగనున్నాయి. ధ్వజారోహణ రోజు స్వామివారికి నూతన వస్త్రాలంకరణతోపాటు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవానికి చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఇక్కడ మహాశివుడి రూపాల్లో మల్లికార్జున స్వరూపం ఒకటి. శ్రీశైలం మల్లికార్జునుడు సహా పలు క్షేత్రాల్లో పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. కానీ, ఇక్కడ విగ్రహం రూపంలో దర్శనమిస్తాడు. దీంతో.. మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేలు రాయుడు పిలుచుకునే.. మైలారుదేవుడి రూపం పది అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, కోరమీసాలతో అలరారుతుంది. నాలుగు చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు.. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. అంతేకాకుండా.. కుడి పాదం కింద, మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి మల్లాసురుల శిరస్సులు ఉంటాయి. అయితే.. ఈ ఆలయానికి 1100 ఏళ్ల చరిత్రతో అంతకుమించిన విశిష్టమైన కళా సంపద ఆలయం సొంతం. ఇక్కడి అష్టోత్తర స్తంభాలు, కాకతీయ కళా సంపద కీర్తితోరణలతో గ్రామం స్వాగతం పలుకుతుంది. పుట్టుమన్నుతో పూజలు మల్లికార్జునస్వామి పూజలందుకుంటారు.
Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్
Also Read
- Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
- CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
- Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
- CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
అయితే.. సంక్రాంతికి ముందు నుంచి ఉగాది వరు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. బ్రహ్మోత్సవాల వేడుకల సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఒగ్గు కథలతో, శివసత్తుల పూనకాలు, పట్నాలు, బోనాలతో సందడిగా కనిపిస్తుంది. జనవరి 14న శనివారం భోగి పండుగ, 15న ఆదివారం మకర సంక్రాంతి బండ్లు తిరుగుట, ఇక.. 17న మహా సంప్రోక్ష సమారాధన పూజలు జరుగనున్నాయి. జనవరి 26న భ్రమరాంబ అమ్మవారి నవమి వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న ఆదివారం ఎల్లమ్మ పండుగ జరుగనున్నది. శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి మార్చి 22 వరకు పంచాహ్నిక దీక్షతో త్రికుండాత్మకంగా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా పలు వాహనసేవలు నిర్వహించనున్నారు. 18న శనివారం శివరాత్రి రోజున కల్యాణం, పెద్దపట్నం, సింహవాహనసేవ, రాత్రి 7 గంటలకు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కల్యాణం జరుగనున్నది. వరంగల్ నుంచి ఐనవోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాఫీగా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు అందుబాటులో వుండేలా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు.
Warangal Crime: మద్యం మత్తులో యువకుల హల్చల్.. అర్ధరాత్రి రోడ్డుపైనే చితకొట్టుకున్న..
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
-
Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!