Inavolu Mallanna Jatara: నేటి నుంచి మైలారు దేవుడి బ్రహ్మోత్సవాలు.. పెటెత్తిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inavolu Mallanna Jatara: వరంగల్ జిల్లాలో నేటి నుంచి ఐనవోలు జాతర మొదలు కానుంది. ఐనవోలు మల్లిఖార్జున స్వామికి అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధం చేసిన అర్చకులు. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో మొదలవున్నాయి. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు కొనసాగనున్నాయి. ధ్వజారోహణ రోజు స్వామివారికి నూతన వస్త్రాలంకరణతోపాటు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవానికి చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఇక్కడ మహాశివుడి రూపాల్లో మల్లికార్జున స్వరూపం ఒకటి. శ్రీశైలం మల్లికార్జునుడు సహా పలు క్షేత్రాల్లో పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. కానీ, ఇక్కడ విగ్రహం రూపంలో దర్శనమిస్తాడు. దీంతో.. మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేలు రాయుడు పిలుచుకునే.. మైలారుదేవుడి రూపం పది అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, కోరమీసాలతో అలరారుతుంది. నాలుగు చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు.. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. అంతేకాకుండా.. కుడి పాదం కింద, మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి మల్లాసురుల శిరస్సులు ఉంటాయి. అయితే.. ఈ ఆలయానికి 1100 ఏళ్ల చరిత్రతో అంతకుమించిన విశిష్టమైన కళా సంపద ఆలయం సొంతం. ఇక్కడి అష్టోత్తర స్తంభాలు, కాకతీయ కళా సంపద కీర్తితోరణలతో గ్రామం స్వాగతం పలుకుతుంది. పుట్టుమన్నుతో పూజలు మల్లికార్జునస్వామి పూజలందుకుంటారు.
Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
అయితే.. సంక్రాంతికి ముందు నుంచి ఉగాది వరు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. బ్రహ్మోత్సవాల వేడుకల సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఒగ్గు కథలతో, శివసత్తుల పూనకాలు, పట్నాలు, బోనాలతో సందడిగా కనిపిస్తుంది. జనవరి 14న శనివారం భోగి పండుగ, 15న ఆదివారం మకర సంక్రాంతి బండ్లు తిరుగుట, ఇక.. 17న మహా సంప్రోక్ష సమారాధన పూజలు జరుగనున్నాయి. జనవరి 26న భ్రమరాంబ అమ్మవారి నవమి వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న ఆదివారం ఎల్లమ్మ పండుగ జరుగనున్నది. శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి మార్చి 22 వరకు పంచాహ్నిక దీక్షతో త్రికుండాత్మకంగా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా పలు వాహనసేవలు నిర్వహించనున్నారు. 18న శనివారం శివరాత్రి రోజున కల్యాణం, పెద్దపట్నం, సింహవాహనసేవ, రాత్రి 7 గంటలకు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కల్యాణం జరుగనున్నది. వరంగల్ నుంచి ఐనవోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాఫీగా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు అందుబాటులో వుండేలా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు.
Warangal Crime: మద్యం మత్తులో యువకుల హల్చల్.. అర్ధరాత్రి రోడ్డుపైనే చితకొట్టుకున్న..
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!