Work From Home: కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం సంస్కృతి బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో ఈ తరహా పనికి ఉద్యోగులు అలవాటు పడ్డారు. ఆఫీసుకలు రమ్మని కంపెనీలు చెబుతున్నా.. కంపెనీలనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగారు ఉద్యోగులు. దీంతో హైబ్రీడ్ మోడ్ లో పనిచేయించుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ఈ వర్క్ ఫ్రం హోం విధానంపై పలువురు కంపెనీల యజమానాలు పెదవి విరుస్తున్నారు.
Read Also: Bihar: జేడీయూ కార్యకర్తలకు మాంసంతో భోజనం.. కుక్కలు కనిపించడం లేదన్న బీజేపీ
ఇదిలా ఉంటే ప్రపంచ కుబేరుడు టెస్లా, ట్విట్టర్ సీఈఓ వర్క్ ఫ్రం హోం విధానంపై మరోసారి స్పందించారు. వర్క్ ఫ్రం హోం విధానం ప్రొడక్టివిటీకి సంబంధించే కాకుండా నైతికంగా సరైంది కాదని అన్నారు. ఇంటి నుంచి ల్యాప్టాప్తో పని సాగించడంతో పని సామర్థ్యంపై ప్రభావం చూపడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్కు పనిచేసే అవకాశం లేని ఫ్యాక్టరీ కార్మికులు, ఇతర ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు పంపుతుందని మస్క్ అన్నారు.
భవన నిర్మాణ కార్మికులు, ఆహార తయారీదారులు, కార్లు తయారు చేసే వారు, మరమ్మత్తులు చేసే వారు, వస్తువులను తయారు చేసే వారంతా తప్పకుండా పని ప్రదేశాలకు వెళతారని..కానీ టెక్కీలు మాత్రం ఇంకా ఇంచి నుంచే పని చేస్తున్నారని సీఎన్బీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ పేర్కొన్నారు. టెస్లా ఉద్యోగులు కార్యాలయాల నుంచే పనిచేయాలన్నారు. ఉద్యోగులు వారానికి కనీసంగా 40 గంటలు తగ్గకుండా ఆఫీస్లో గడపాలన్నారు. కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేశారంటే అర్థం ఉంది కానీ.. ప్రస్తుతం కరోనా తగ్గు ముఖం పట్టిన సమయంలో కూడా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిండం సరైంది కాదన్నారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఏమీ తగ్గదు కాబట్టి దీనిని కొనసాగించినా తప్పేమీ కాదంటున్నారని.. కానీ అది సరైంది కాదని ఎలన్ మస్క్ అన్నారు.