Bihar: జేడీయూ కార్యకర్తలకు మాంసంతో భోజనం.. కుక్కలు కనిపించడం లేదన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్ లో జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నాయకుడు ఏర్పాటు చేసిన పార్టీ వివాదాస్పదం అయింది. జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ తన కార్యకర్తలకు మటన్ రైస్ తో విందు ఏర్పాటు చేశారు. ముంగేర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ నాయకుడు చేసిన విమర్శలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జేడీయూ అధ్యక్షుడు విందు ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ఆ ప్రాంతంలో వందలాది కుక్కలు కనిపించడం లేదని బీజేపీ ఆరోపించారు.
Read Also: Septic Tank: సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా.. ఊపిరాడక కార్మికుడు మృతి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఈ విందు కార్యక్రమంలో రద్దీని అదుపు చేయలేక తోపుటాల జరిగింది. పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకున్నారు. జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ మాంసంతో పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. అయితే ఆ సమయం నుంచి నగరంలో వందలాది కుక్కలు కనిపించకుండా పోయాయని పలువురు తెలిపారని, వీటి మాంసాన్నే కార్యకర్తలకు తినిపించారని, దీన్ని విచారణ చేయాలని, దీని వల్ల ఏ వ్యాధి వ్యాప్తిస్తుందో అని, మద్యం సేవించారా లేదా..? అన్నది దర్యాప్తు చేయాలని అని బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా బుధవారం ఆరోపించారు. బీహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే ఆ విందు కార్యక్రమంలో జేడీయూ నేతలు, కార్యకర్తలు మద్యం సేవించారా..? లేదా..? అనేది విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా ఆరోపణలపై జేడీయూ పార్టీ ఫైర్ అయింది. విజయ్ కుమార్ సిన్హా ‘‘ మానసికంగా దివాళా తీశారు’’ అని పేర్కొంది. బీజేపీ నేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జేడీ(యూ) అధికార ప్రతినిధి అభిషేక్ ఝా మాట్లాడుతూ.. తన విందులో ప్రజలకు ఏ జంతువు మాంసాన్ని వడ్డిస్తాడో విజయ్ కుమార్ సిన్హా స్వయంగా వెల్లడించాలని అన్నారు.
- Tags
- bihar
- bjp
- Dog meat
- dogs missing
- JDU
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!