Trump-Putin: పుతిన్కు ట్రంప్ మరోసారి వార్నింగ్.. 2 వారాల్లో శాంతి ఒప్పందం చేసుకోకపోతే..!
- పుతిన్కు ట్రంప్ మరోసారి వార్నింగ్
- 2 వారాల్లో శాంతి ఒప్పందం చేసుకోవాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తు్న్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కృషి చేస్తున్నారు. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపానని పదే పదే చెబుతున్నారు. ఇక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపినట్లు ప్రకటించారు. తాజాగా థాయ్లాండ్-కంబోడియా మధ్య కూడా యుద్ధాన్ని ఆపానని వెల్లడించారు. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ముందుకొస్తుంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో పుతిన్పై తీవ్ర స్థాయిలో ట్రంప్నకు కోపం వస్తోంది. అనేక మార్లు రష్యాను హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Mahadev Operation: ఉగ్రవాదుల్ని సైన్యం ఎలా మట్టుబెట్టింది.. మహాదేవ్ ఆపరేషన్ సీక్రెట్ ఇదే!
Also Read
తాజాగా మరోసారి పుతిన్ను ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి అంగీకరించడానికి 10-12 రోజుల సమయం ఉందని.. ఆ సమయంలోగా అంగీకరించాలని లేదంటే ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ కుదరకపోతే త్వరలో రష్యాపై ద్వితీయ సుంకాలు విధించనున్నట్లు హెచ్చరికలు పంపారు. గతంలో పుతిన్కు 50 రోజుల సమయం ఇచ్చారు. తాజాగా ఆ సమయాన్ని తగ్గిస్తూ సోమవారం తాజా హెచ్చరికలు జారీ చేశారు. 10-12 రోజుల్లో ఏదొకటి తేల్చాల్సిందేనని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: HHVM : క్రిష్ కథతో వీరమల్లు సెకండ్ పార్టు..!
దాదాపు 4 ఏళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరుదేశాలు యుద్ధం కారణంగా ఎంతో నష్టపోయాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు ఫలించలేదు. దీంతో ట్రంప్ విసుగు చెందారు. రష్యాను దెబ్బకొట్టేందుకు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా 100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nimisha Priya: యెమెన్ చేరుకున్న నిమిషా ప్రియ కుటుంబ సభ్యులు.. విడిచిపెట్టాలని కుమార్తె వేడుకోలు
తాజావార్తలు
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?