US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- అమెరికా దాడుల్లో చాబహార్ షాహిద్ బెహెష్టి టెర్మినల్ ధ్వంసం.
- భారత్ పెట్టుబడులు పెట్టిన కీలక పోర్టుపై ప్రభావం.
- చైనా-ఇరాన్ రైల్వే కారిడార్లోని వంతెనపై దాడి.
- ఒకేసారి భారత్, చైనాలను దెబ్బతీసిన అమెరికా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: ఇరాన్పై అమెరికా మరోసారి విరుచుకుపడుతోంది. గత రెండు రోజులుగా ఇరాన్పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. హార్ముజ్లో స్వేచ్ఛా నౌకాయానాన్ని ఇరాన్ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులు ఇరాన్కు మాత్రమే కాకుండా భారత్, చైనాలను కూడా దెబ్బతీస్తున్నాయి.
చాబహార్పై దాడి:
భారత్ పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు చేసింది. భారత్కు ఇది ఎంతో వ్యూహాత్మక పెట్టుబడి. పాకిస్తాన్ను కాదని మధ్య ఆసియాలోకి భారత్ చేరేందుకు చాబహార్ పోర్టు, ఆఫ్ఘనిస్తాన్ సహాయపడుతాయి. ఇదే పోర్టుపై యూఎస్ వైమానిక దాడులకు తెగబడింది. పోర్టులోని షాహిద్ బెహెష్టి టెర్మినట్ దెబ్బతిన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. టెర్మినల్తో పాటు నౌకాశ్రయ నియంత్రణ టవర్, కలంతరి పోర్ట్, విద్యుత్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
Also Read
టెర్మినల్ అభివృద్ధి కోసం భారతదేశం 2015లో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేయగా, 2024లో 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారతదేశం ఇప్పటివరకు 120 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా, ప్రధాని మోదీ 2016లో 500 మిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేశారు. 2024లో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, చాబహార్లోని షాహిద్ బెహెష్టి పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి కోసం ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్తో ఒక ఒప్పందంపై సంతకం చేశారు.
చైనాకు దెబ్బే:
అమెరికా ఉత్తర ఇరాన్లోని ఒగ్టే ఖాన్ రైల్వే వంతెనపై క్రూయిజ్ మిస్సైళ్లలో దాడులు చేసింది. ఈ వంతెన చైనా-తుర్క్మెనిస్తాన్-ఇరాన్ రైల్వే కారిడార్కు చాలా కీలకమైంది.ఇరాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా, ఇరాన్తో ఈ మార్గం ద్వారా వాణిజ్యం చేస్తోంది. ఇదే కాకుండా ఇరాన్కు మద్దతు ఇస్తున్న రష్యా కూడా 2025 నుంచి ఈ రైల్వే మార్గం ద్వారా సరుకుల రవాణా చేస్తోంది.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?