Ranil Wickremesinghe:ఉన్న ఒక్క ఇంటినీ కాల్చేశారు.. శ్రీలంక ప్రధాని తీవ్ర ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనకు ఉన్న ఒక్క ఇంటిని కూడా కాల్చివేశారని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశ టెలివిజన్లో మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా జరిగిన నష్టంపై ఆయన స్పందించారు. హిట్లర్ తరహా మనస్తత్వం ఉన్న వ్యక్తులే ఇలాంటి చర్యలతు దిగుతారని ఆయన మండిపడ్డారు. దేశం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా అధ్యక్షుడి కోరిక మేరకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టానని ఆయన చెప్పుకొచ్చారు.
కనీస నిత్యావసరాలు తీర్చుకోలేని స్థితిలో దేశం ఉండగా.. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే భారాన్నిమోసేందుకు సిద్ధమయ్యానన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు 4 సంవత్సరాలు పడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని వెల్లడించారు. ఇదంతా ఒకటి రెండు రోజుల్లో తీరే సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యలు చేపడుతున్న సమయంలో తన ఇంటికి నిప్పు పెట్టడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నియంత హిట్లర్ తరహా మనస్తత్వం ఉన్నవారే ఇలాంటి చర్యలు దిగుతారన్నారు. తాను ప్రధాని పదవికి రాజీనామా నిరాకరించానని, అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు అభ్యంతరం చెప్పానంటూ ఓ పార్టీ నేత చేసిన ట్వీట్ ఈ పరిస్థితికి దారితీసిందని చెప్పారు. ఒకవేళ అఖిలపక్షం ఏర్పడినా వెంటనే రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
PM Modi: ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిది..
శనివారం అన్ని సమావేశాలను రద్దు చేసుకొని, ఇంట్లోనే కూర్చున్నా. అప్పుడు పోలీసులు వచ్చి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఇక్కడ పరిస్థితులు అదుపుతప్పే అవకాశం ఉందని వెల్లడించారని రణిల్ విక్రమ సింఘే తెలిపారు. వెంటనే భార్యతో కలిసి సాయంత్రం అక్కడి నుంచి వెళ్లిపోయానన్నారు. సొంత దేశంలో, విదేశంలో కలిపి తనకు ఒకే ఒక్క ఇల్లు ఉందన్నారు. ఆ ఒక్క దానికి కూడా నిప్పుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన లైబ్రరీలో 2,500 పుస్తకాలున్నాయని.. అదే తనకున్న ఆస్తి అని వెల్లడించారు. 200 ఏళ్ల నాటి విలువైన కళాఖండాలున్నాయన్నారు. అన్నింటిని ధ్వంసం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో సేకరించిన పుస్తకాలన్నింటిని శ్రీలంకలోని కళాశాల, ఒక అంతర్జాతీయ సంస్థకు వితరణ చేయాలనుకున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
-
Ruturaj Gaikwad: “అలా చేసినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు”.. చెన్నై ఘోర పరాజయంపై కెప్టెన్ రియాక్షన్..
-
Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
-
Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!