Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News India Is Mother Of Democracy Says Pm Modi

PM Modi: ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిది..

Published Date :July 12, 2022 , 9:46 pm
By Mahesh Jakki
PM Modi: ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, దేశ ప్రజలందరూ తమ విధులను దేశ హక్కులతో సమానంగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కోరారు.ఇవాళ పాట్నాలో జరిగిన బిహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బిహార్ విధానసభకు 100 సంవత్సరాల స్మారకార్థం నిర్మించిన శతాబ్ది స్మృతి స్తంభాన్ని ఆయన ప్రారంభించారు. విధానసభ మ్యూజియంకు ఆయన శంకుస్థాపన చేశారు. మ్యూజియంలోని వివిధ గ్యాలరీలు బిహార్‌లో ప్రజాస్వామ్య చరిత్రను ప్రదర్శిస్తాయి. ఇందులో 250 మంది కంటే ఎక్కువగా కూర్చునే సామర్థ్యం కలిగిన కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా విధానసభ అతిథి గృహానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బిహార్ విధానసభ కాంప్లెక్స్‌ను సందర్శించిన మొదటి ప్రధానిగా తాను ఘనత పొందినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. బిహార్ ప్రజల అభిమానానికి నమస్కరిస్తున్నానన్నారు. శతాబ్ది స్మృతి స్తంభం బిహార్ అనేక ఆకాంక్షలను గుర్తు చేస్తుందన్నారు.

బిహార్ అసెంబ్లీ యొక్క అద్భుతమైన చరిత్రను గుర్తుచేసుకున్న ప్రధాన మంత్రి.. ఇక్కడ విధానసభ భవనంలో ఒకదాని తర్వాత ఒకటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలని, స్వదేశీ చరఖాను స్వీకరించాలని గవర్నర్ సత్యేంద్ర ప్రసన్న సిన్హా ఈ సభ నుండి విజ్ఞప్తి చేశారని ప్రధాని మోదీ తెలిపారు. “స్వాతంత్ర్యం తర్వాత జమీందారీ నిర్మూలన చట్టం ఈ అసెంబ్లీలో ఆమోదించబడింది. ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్లి నితీష్ ప్రభుత్వం బిహార్ పంచాయతీరాజ్ వంటి చట్టాన్ని ఆమోదించింది. పంచాయితీలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రంగా బిహార్‌ను మార్చింది” అని ఆయన గుర్తు చేసుకున్నారు.

Also Read

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • Producing States in India: భారత్‌లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
  • Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..

Viral News: సీఎంకు చల్లారిన టీ.. అధికారికి షోకాజ్ నోటీసులు

ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ అని ప్రధాని పునరుద్ఘాటించారు. బిహార్ వైభవాన్ని ఎవరూ చెరిపివేయలేరన్నారు.ఈ అసెంబ్లీ భవనం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని ప్రధాని మోదీ వెల్లడించారు. బ్రిటీష‌ర్ల‌కు వ్య‌తిరేకంగా శ్రీ‌బాబు స్వ‌తంత్ర ప‌రిపాల‌న‌ను ప్ర‌క‌టించిన విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. బిహార్ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి నిబద్ధతలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉందన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రూపంలో బిహార్ స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతిని ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌, కర్పూరీ ఠాకూర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ లాంటి నాయకులు ఈ నేల నుంచే వచ్చారని ప్రధాని తెలిపారు. దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం జరిగినప్పుడు కూడా బిహార్ తెరపైకి వచ్చి దానికి వ్యతిరేకంగా నిలబడిందన్నారు. బిహార్ ఎంత సంపన్నంగా ఉంటే, భారత ప్రజాస్వామ్యం అంత శక్తివంతంగా ఉంటుందని ప్రధాని అన్నారు. బిహార్ బలంగా ఉంటే భారతదేశం మరింత సమర్థంగా ఉంటుందని ప్రధాన మంత్రి సూచించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar
  • Bihar Assembly
  • mother of democracy
  • PM Modi
  • pm modi bihar visit

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions