US-IRAN War: అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేశాం.. ఇరాన్ సంచలన ప్రకటన.
- జోర్డాన్లోని అమెరికా లక్ష్యాలపై దాడి చేశామన్న ఇరాన్.
- పలు అమెరికా ఫైటర్ జెట్లు, రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయని వాదన.
- సిరియాలోని అమెరికా కమాండ్ సెంటర్పై కూడా దాడి చేసినట్లు ప్రకటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-IRAN War: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది. అమెరికా వైమానిక దాడుల పరంపరను కొనసాగిస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ బహ్రైయిన్, ఖతార్, కువైట్ లలో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే జోర్డాన్లోని అమెరికా సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించామని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, ఇంధనం నింపే విమానాలు ధ్వంసమైనట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) వెల్లడించింది.అమెరికా రాత్రి జరిపిన దాడుల్లో 8 మంది మరణించిన నేపథ్యంలో దీనికి ప్రతీకారంగా దాడులు చేశామని చెప్పింది.
ఐఆర్జీసీ విడుదల చేసిన ప్రకటనలో అమెరికాకు తీవ్ర నష్టం కలిగించినట్లు చెప్పింది. జోర్డాన్లో అమెరికాను లక్ష్యంగా చేసుకోవాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. మరోవైపు, సిరియాలోని అల్ తన్ప్ ప్రాంతంలో ఉన్న అమెరికా స్పెషల్ ఆపరేషన్ కమాండ్ సెంటర్పై కూడా దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే, ఈ దాడిపై అటు అమెరికా, ఇటు సిరియా నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరన రాలేదు. ఇదిలా ఉంటే, ఇరాన్ ప్రకటనకు భిన్నంగా స్పందించిన జోర్డాన్.. ఇరాన్కు చెందిన మూడు క్షిపణుల్ని కూల్చేసినట్లు ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదని చెప్పింది. అమెరికా దాడులు కొనసాగినంత కాలం హార్ముజ్ జలసంధి ద్వారా చమురు, గ్యాస్ సరఫరా జరగవని ఇరాన్ తేల్చి చెప్పింది.
Also Read
తాజావార్తలు
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!