Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతన్నలకు శుభాకాంక్షలు తెలుపుతూ కీలక ప్రకటన చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో చేనేత, వస్త్ర పరిశ్రమ అత్యంత కీలకమైన భాగమని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం తర్వాత దేశంలో దాదాపు 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రంగం ఇదేనని, ఇది దేశానికి గణనీయమైన విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తోందని చెప్పారు.
ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘మేక్ ఇన్ ఇండియా’తో పాటు 5F విజన్ (ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్) అమలు చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచ వస్త్రకేంద్రంగా మార్చే లక్ష్యంతో 2030 నాటికి ఎగుమతులను రూ.9 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.
Also Read
- Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
- Punjab Politics: పంజాబ్లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
- Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
పీఎల్ఐ (PLI) పథకం, పీఎం మిత్ర పార్కులు, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రా మెటీరియల్ సప్లయ్ స్కీమ్, వీవర్స్ ముద్రా స్కీమ్ ద్వారా నేత కార్మికులకు ఆధునిక మగ్గాలు, ముడిసరుకు, రుణాలు, మార్కెటింగ్ సౌకర్యాలు మరియు సామాజిక భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలోని వరంగల్లో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయడమే కాకుండా, పత్తి రైతుల నుంచి మద్దతు ధర (MSP) కింద కేంద్రం రూ.69,860 కోట్లకు పైగా ఖర్చు చేసిందని చెప్పారు. చేనేత రంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికతను అనుసంధానిస్తూ ఉత్పాదకత, నాణ్యతను పెంచుతున్నామని పేర్కొన్నారు. సంప్రదాయ కళను కాపాడుతూ నేతన్నలను ఆదుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి ప్రోత్సహించాలని కోరారు.
తాజావార్తలు
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!