Pakistan: ఇమ్రాన్ఖాన్కు మద్దతుగా ఆందోళనలు.. కనిపిస్తే కాల్చివేతకు పాక్ సర్కార్ ఆదేశాలు
- పాకిస్తాన్లో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు..
- ఇమ్రాన్ఖాన్కు మద్దతుగా పీటీఐ కార్యకర్తలు, నేతలు ఆందోళన..
- కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలను జారీ చేసిన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ దేశంలోని గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు మద్దతుగా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నేతలు, కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అణచి వేసేందుకు.. కనిపిస్తే కాల్చివేతకు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిరసన ప్రదర్శనలకు స్వస్తి పలుకుతున్నట్లు పీటీఐ కార్యకర్తలు ప్రకటించారు.
Read Also: Urvil Patel: విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ
Also Read
- Pakistan: ఇమ్రాన్ ఖాన్కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..
- China swine Flu Case: చైనాలో తొలిసారి మనిషికి స్వైన్ ఫ్లూ A(H1N2)v.. భారత్కు ముప్పు ఎంత?
- Shahzad Bhatti: ఆపరేషన్ హైబ్రిడ్ టెర్రర్! ఉగ్రవాదుల ఖేల్ ఖతం.. ఎవరీ షాజాద్ భట్టి?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
ఇక, పీటీఐ నిసరనల నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్లోని డీ చౌక్లో హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. దీంతో పాక్ భద్రతా సిబ్బంది కఠిన చర్యలు అమలు చేయడంతో.. ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులు నిరసనలు విరమిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, తదుపరి వ్యూహం ఏమిటనేది ఇమ్రాన్ పార్టీ ఇంకా వెల్లడించలేదు. భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలను ఫాసిస్ట్ మిలిటరీ పాలనగా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అభివర్ణించింది.
Read Also: Parliament Winter Session: లోక్సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా
అయితే, ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 450 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశ్యంతోనే పాక్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరుపుతున్నాయని పిటిఐ నేతలు ఆరోపించారు. ఇక, పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోగా.. పదుల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. అలాగే, షాబాజ్-జర్దారీ-అసిమ్ కూటమి నేతృత్వంలో పాక్ భద్రతా దళాలు మారణహోం కోసం ట్రై చేస్తున్నాయని పీటీఐ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కు మద్దుతుగా నవంబర్ 24వ తేదీన దేశవ్యాప్త నిరసనలకు పీటీఐ పార్టీ చివరి పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Pakistan: ఇమ్రాన్ ఖాన్కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..
-
Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
Ram Pothineni: అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్.. భోజనం చేసి మందులు వేసుకో.. నన్ను కలవొచ్చు
-
WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
ట్రెండింగ్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!