Pakistan: న్యూమోనియాతో పాకిస్తాన్లో 200 మంది పిల్లలు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో చలి తీవ్రతతో పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గత మూడు వారాలుగా ఆ దేశంలో చలి వాతావరణం కారణంగా న్యుమోనియా విజృంభిస్తోంది. న్యుమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్సులో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మరణించిన పిల్లల్లో చాలా మందిని న్యుమోనియా వ్యాక్సిన్ వేయలేదని పంజాబ్ ఆపద్ధర్మ ప్రభుత్వం వెల్లడించింది.
న్యుమోనియా టీకాలు వేయకపోవడం, పోషకాహార లోపం, తల్లిపాలు లేని కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, తీవ్రమైన వాతావరణ కారణంగా మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 31వరకు పంజాబ్ ప్రావిన్సులో పాఠశాలలు ఉదయం తెరుచుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. జనవరి 1 నుంచి ప్రావిన్స్ వ్యాప్తంగా మొత్తం 10,520 న్యుమోనియా కేసులు నమోదయ్యయి. మొత్తం 220 మరణాల్లో.. పిల్లలు 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే అధికం. పంజాబ్ రాజధాని లాహోర్లోనే 47 మరణాలు సంభవించాయి.
Also Read
Read Also: Car Mileage: “కార్ మైలేజ్ రావడం ఇవ్వడం లేదని”.. 20 ఏళ్ల తర్వాత మారుతి సుజుకీకి జరిమానా..
దీనిపై పాక్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో శిశువులు పుట్టిన ఆరు వారాల తర్వాత సీసీవీ యాంటీ న్యుమోనియా వ్యాక్సిన్ ఇస్తారన్నారు. శిశువు పుట్టినప్పటి నుంచి 12 టీకాలు ఇస్తే అందులో 3 న్యూమోనియా నుంచి రక్షించడానికి ఉద్దేశించబడినవన్నారు. న్యుమోనియా వైరస్, బ్యాక్టీరియా రెంటింటి వలన రావచ్చని, న్యుమోనియా బారిన పడకుండా మాస్కులు ధరించాలని, చేతులను నీటితో కడుక్కోవాలని, వెచ్చని బట్టలు ధరించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. గతేడాది పంజాబ్ లో 990 మంది చిన్నారులు న్యుమోనియాతో మరణించారు. చలి వాతావరణం పెరగడం వల్ల పిల్లల్లో వైరల్ న్యుమోనియా వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ఈ వ్యాధి కోవిడ్-19 లాగా వ్యాపిస్తుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
తాజావార్తలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!