Pakistan: న్యూమోనియాతో పాకిస్తాన్లో 200 మంది పిల్లలు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో చలి తీవ్రతతో పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గత మూడు వారాలుగా ఆ దేశంలో చలి వాతావరణం కారణంగా న్యుమోనియా విజృంభిస్తోంది. న్యుమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్సులో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మరణించిన పిల్లల్లో చాలా మందిని న్యుమోనియా వ్యాక్సిన్ వేయలేదని పంజాబ్ ఆపద్ధర్మ ప్రభుత్వం వెల్లడించింది.
న్యుమోనియా టీకాలు వేయకపోవడం, పోషకాహార లోపం, తల్లిపాలు లేని కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, తీవ్రమైన వాతావరణ కారణంగా మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 31వరకు పంజాబ్ ప్రావిన్సులో పాఠశాలలు ఉదయం తెరుచుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. జనవరి 1 నుంచి ప్రావిన్స్ వ్యాప్తంగా మొత్తం 10,520 న్యుమోనియా కేసులు నమోదయ్యయి. మొత్తం 220 మరణాల్లో.. పిల్లలు 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే అధికం. పంజాబ్ రాజధాని లాహోర్లోనే 47 మరణాలు సంభవించాయి.
Also Read
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
Read Also: Car Mileage: “కార్ మైలేజ్ రావడం ఇవ్వడం లేదని”.. 20 ఏళ్ల తర్వాత మారుతి సుజుకీకి జరిమానా..
దీనిపై పాక్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో శిశువులు పుట్టిన ఆరు వారాల తర్వాత సీసీవీ యాంటీ న్యుమోనియా వ్యాక్సిన్ ఇస్తారన్నారు. శిశువు పుట్టినప్పటి నుంచి 12 టీకాలు ఇస్తే అందులో 3 న్యూమోనియా నుంచి రక్షించడానికి ఉద్దేశించబడినవన్నారు. న్యుమోనియా వైరస్, బ్యాక్టీరియా రెంటింటి వలన రావచ్చని, న్యుమోనియా బారిన పడకుండా మాస్కులు ధరించాలని, చేతులను నీటితో కడుక్కోవాలని, వెచ్చని బట్టలు ధరించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. గతేడాది పంజాబ్ లో 990 మంది చిన్నారులు న్యుమోనియాతో మరణించారు. చలి వాతావరణం పెరగడం వల్ల పిల్లల్లో వైరల్ న్యుమోనియా వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ఈ వ్యాధి కోవిడ్-19 లాగా వ్యాపిస్తుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
తాజావార్తలు
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!