Pakistan: పాకిస్తాన్లో చలి తీవ్రతతో పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గత మూడు వారాలుగా ఆ దేశంలో చలి వాతావరణం కారణంగా న్యుమోనియా విజృంభిస్తోంది. న్యుమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్సులో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మరణించిన పిల్లల్లో చాలా మందిని న్యుమోనియా వ్యాక్సిన్ వేయలేదని పంజాబ్ ఆపద్ధర్మ ప్రభుత్వం వెల్లడించింది.