Car Mileage: “కార్ మైలేజ్ రావడం ఇవ్వడం లేదని”.. 20 ఏళ్ల తర్వాత మారుతి సుజుకీకి జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Mileage: సహజంగా మనదేశంలో ఏ వాహనాన్ని కొనుగోలు చేసినా, ముందుగా అడిగేది అది లీటర్కి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందని, మైలేజ్ అంచనా ఆధారంగా ప్రజలు బైకుల్ని, కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం తనను మైలేజ్ విషయంలో మోసం చేశారని, కార్ కంపెనీపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన 2004లో జరిగింది. తాజాగా నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) సదరు కారు తయారీ సంస్థ మారుతీ సుజుకీని, బాధితుడికి రూ. 1 లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Read Also: Bhavatharini: డియర్ డాటర్.. ఏడిపిస్తున్న ఇళయరాజా పోస్ట్
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
గత వారం ఇచ్చిన తీర్పులో డాక్టర్ ఇందర్ జిత్ సింగ్ నేతృత్వంలోని ఎన్సీడీఆర్సీ బెంచ్ తీర్పును ఇచ్చింది. ‘‘సాధారణంగా కారును కోనుగోలు చేసే వ్యక్తి కారు ఇంధన సామర్థ్యాన్ని ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. కారు ఇంధన సామర్థ్యానికి సంబంధించి మేము ఈ విషయంలో 20 అక్టోబర్ 2004 నాటి ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాము మరియు ఇది తప్పుదారి పట్టించే ప్రకటన అని భావించాము. ప్రకటన తయారీదారు, డీలర్ యొక్క అన్యాయమైన వ్యాపారానికి సమానం’’ అంటూ వ్యాఖ్యానించింది.
కేసు విషయాని వస్తే 2004లో రాజీవ్ శర్మ అనే వ్యక్తి మారుతీ సుజుకి జెన్ కారును కొనుగోలు చేశారు. లీటర్కి 16-18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందనే ప్రకటన ఆధారంగా అతను కారుని కొనుగోలు చేశాడు. వాస్తవానికి శర్మ కారు లీటర్కి 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ ఇస్తుండటంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ని ఆశ్రయించాడు. వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు మరియు బీమాతో సహా మొత్తం ₹ 4,00,000తో సహా కారు కొనుగోలు ధరను పూర్తిగా వాపసు చేయాలని అతను అభ్యర్థించాడు. జిల్లా ఫోరం అతని అభ్యర్థనను కొంతమేర అంగీకరించి అతనికి రూ. 1 లక్ష పరిహారం ఇప్పించింది. ఈ నిర్ణయంపై మారుతి సుజుకీ స్టేట్ కమిషన్ని ఆశ్రయించింది. అయితే, జిల్లా ఫోరం ఆదేశాలను రాష్ట్ర కమిషన్ సమర్థించింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?