Car Mileage: “కార్ మైలేజ్ రావడం ఇవ్వడం లేదని”.. 20 ఏళ్ల తర్వాత మారుతి సుజుకీకి జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Mileage: సహజంగా మనదేశంలో ఏ వాహనాన్ని కొనుగోలు చేసినా, ముందుగా అడిగేది అది లీటర్కి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందని, మైలేజ్ అంచనా ఆధారంగా ప్రజలు బైకుల్ని, కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం తనను మైలేజ్ విషయంలో మోసం చేశారని, కార్ కంపెనీపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన 2004లో జరిగింది. తాజాగా నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) సదరు కారు తయారీ సంస్థ మారుతీ సుజుకీని, బాధితుడికి రూ. 1 లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Read Also: Bhavatharini: డియర్ డాటర్.. ఏడిపిస్తున్న ఇళయరాజా పోస్ట్
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
గత వారం ఇచ్చిన తీర్పులో డాక్టర్ ఇందర్ జిత్ సింగ్ నేతృత్వంలోని ఎన్సీడీఆర్సీ బెంచ్ తీర్పును ఇచ్చింది. ‘‘సాధారణంగా కారును కోనుగోలు చేసే వ్యక్తి కారు ఇంధన సామర్థ్యాన్ని ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. కారు ఇంధన సామర్థ్యానికి సంబంధించి మేము ఈ విషయంలో 20 అక్టోబర్ 2004 నాటి ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాము మరియు ఇది తప్పుదారి పట్టించే ప్రకటన అని భావించాము. ప్రకటన తయారీదారు, డీలర్ యొక్క అన్యాయమైన వ్యాపారానికి సమానం’’ అంటూ వ్యాఖ్యానించింది.
కేసు విషయాని వస్తే 2004లో రాజీవ్ శర్మ అనే వ్యక్తి మారుతీ సుజుకి జెన్ కారును కొనుగోలు చేశారు. లీటర్కి 16-18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందనే ప్రకటన ఆధారంగా అతను కారుని కొనుగోలు చేశాడు. వాస్తవానికి శర్మ కారు లీటర్కి 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ ఇస్తుండటంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ని ఆశ్రయించాడు. వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు మరియు బీమాతో సహా మొత్తం ₹ 4,00,000తో సహా కారు కొనుగోలు ధరను పూర్తిగా వాపసు చేయాలని అతను అభ్యర్థించాడు. జిల్లా ఫోరం అతని అభ్యర్థనను కొంతమేర అంగీకరించి అతనికి రూ. 1 లక్ష పరిహారం ఇప్పించింది. ఈ నిర్ణయంపై మారుతి సుజుకీ స్టేట్ కమిషన్ని ఆశ్రయించింది. అయితే, జిల్లా ఫోరం ఆదేశాలను రాష్ట్ర కమిషన్ సమర్థించింది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!