Car Mileage: “కార్ మైలేజ్ రావడం ఇవ్వడం లేదని”.. 20 ఏళ్ల తర్వాత మారుతి సుజుకీకి జరిమానా..
Car Mileage: సహజంగా మనదేశంలో ఏ వాహనాన్ని కొనుగోలు చేసినా, ముందుగా అడిగేది అది లీటర్కి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందని, మైలేజ్ అంచనా ఆధారంగా ప్రజలు బైకుల్ని, కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం తనను మైలేజ్ విషయంలో మోసం చేశారని, కార్ కంపెనీపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన 2004లో జరిగింది. తాజాగా నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) సదరు కారు తయారీ సంస్థ మారుతీ సుజుకీని, బాధితుడికి రూ. 1 లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Read Also: Bhavatharini: డియర్ డాటర్.. ఏడిపిస్తున్న ఇళయరాజా పోస్ట్
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
గత వారం ఇచ్చిన తీర్పులో డాక్టర్ ఇందర్ జిత్ సింగ్ నేతృత్వంలోని ఎన్సీడీఆర్సీ బెంచ్ తీర్పును ఇచ్చింది. ‘‘సాధారణంగా కారును కోనుగోలు చేసే వ్యక్తి కారు ఇంధన సామర్థ్యాన్ని ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. కారు ఇంధన సామర్థ్యానికి సంబంధించి మేము ఈ విషయంలో 20 అక్టోబర్ 2004 నాటి ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాము మరియు ఇది తప్పుదారి పట్టించే ప్రకటన అని భావించాము. ప్రకటన తయారీదారు, డీలర్ యొక్క అన్యాయమైన వ్యాపారానికి సమానం’’ అంటూ వ్యాఖ్యానించింది.
కేసు విషయాని వస్తే 2004లో రాజీవ్ శర్మ అనే వ్యక్తి మారుతీ సుజుకి జెన్ కారును కొనుగోలు చేశారు. లీటర్కి 16-18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందనే ప్రకటన ఆధారంగా అతను కారుని కొనుగోలు చేశాడు. వాస్తవానికి శర్మ కారు లీటర్కి 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ ఇస్తుండటంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ని ఆశ్రయించాడు. వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు మరియు బీమాతో సహా మొత్తం ₹ 4,00,000తో సహా కారు కొనుగోలు ధరను పూర్తిగా వాపసు చేయాలని అతను అభ్యర్థించాడు. జిల్లా ఫోరం అతని అభ్యర్థనను కొంతమేర అంగీకరించి అతనికి రూ. 1 లక్ష పరిహారం ఇప్పించింది. ఈ నిర్ణయంపై మారుతి సుజుకీ స్టేట్ కమిషన్ని ఆశ్రయించింది. అయితే, జిల్లా ఫోరం ఆదేశాలను రాష్ట్ర కమిషన్ సమర్థించింది.
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!