North Korea: రోడ్లను పేల్చేసిన నార్త్ కొరియా.. మండిపడిన దక్షిణ కొరియా..
- ఉత్తర- దక్షిణ కొరియా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత..
- దక్షిణ కొరియాను కలిపే రోడ్లను పేల్చేయించిన కిమ్ జోంగ్ ఉన్..
- కిమ్ పై తీవ్ర స్థాయిలో మండిపడిన దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తాను అనుకున్నదే చేశాడు. దక్షిణ కొరియాను కలిపే రహదారులను పేల్చేయించాడు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఈరోజు ఉదయం మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. తమ వైపు ఉన్న రోడ్లను సైన్యం కాపాడుతోందన్నారు. కిమ్ తన టాప్ మిలిటరీ, సెక్యూరిటీ అధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. దక్షిణ కొరియా డ్రోన్ల వస్తే తీవ్రమైన కవ్వింపు చర్యగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు కొన్ని రహస్య సూచనలు చేశాడని ఆ దేశ మీడియా వెల్లడించింది.
Read Also: IPL 2025 Auction: రోహిత్ను దక్కించుకోవాలంటే 20 కోట్లు పక్కనపెట్టుకోవాలి: అశ్విన్
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
ఇక, కిమ్ సర్కారు శతఘ్ని దళాన్ని సరిహద్దుల దగ్గరకు పంపింది. సౌత్ కొరియా డ్రోన్లు కనిపిస్తే వెంటనే దాడి స్టార్ట్ చేయాలని వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దక్షిణ కొరియా మాత్రం కిమ్ జోంగ్ ఉన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం నార్త్ కొరియా తీవ్రంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కాగా, 2000 సంవత్సరంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో ఉత్తర- దక్షిణ కొరియాల మధ్య రోడ్లను నిర్మించారు. దీంతో పాటు రెండు రైలు మార్గాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీటి దగ్గర భారీ భద్రతను సైతం ఏర్పాటు చేశారు. కానీ, ఉత్తర కొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాలతో ఆ తర్వాత ఈ మార్గాలను బంద్ చేశారు.
Read Also: SSC GD: భారీ రిక్రూట్మెంట్.. పది పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగం
అయితే, ఈ రోడ్ల ధ్వంసంపై గత వారం నార్త్ కొరియా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా క్లోజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం.. ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు ఉత్తర కొరియా సైన్యం పేర్కొనింది. అకస్మాత్తుగా సంఘర్షణ తలెత్తకుండా అమెరికా మిలిటరీకి ముందే సమాచారం ఇచ్చామని చెప్పుకొచ్చింది. రెండు కొరియాల మధ్య ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలను మూసేస్తున్నట్లు ప్యోగ్యాంగ్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!