IPL 2025 Auction: రోహిత్ను దక్కించుకోవాలంటే 20 కోట్లు పక్కనపెట్టుకోవాలి: అశ్విన్
- రిటైన్ జాబితాను అక్టోబర్ 31లోపు సమర్పించాలి
- అందరి కళ్లు రోహిత్ శర్మపైనే
- కోహ్లీ-రోహిత్ ఒకే జట్టులో ఉండే అవకాశం ఉందా?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. దీంతో ఏ ప్రాంచైజీ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వేలంలోకి వదిలేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అందరి కళ్లు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో హిట్మ్యాన్ తన పేరును నమోదు చేసుకుంటాడని ప్రచారం జరుగుతుండడమే ఇందుకు కారణం.
ఐపీఎల్ 2024 ముందు కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి ఫ్రాంఛైజీకి, రోహిత్కు మధ్య గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబై ఇండియన్స్తో ఉన్న 13 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెప్పి.. వేరే ఫ్రాంఛైజీలో చేరాలని హిట్మ్యాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ను తీసుకోవడానికి చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తున్నాయట. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా ఉందట.
Also Read
Also Read: Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?
తాజాగా భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతుండగా.. అభిమాని నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకే జట్టులో ఉండే అవకాశం ఉందా? అని అని అడిగాడు. దీనికి అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. రోహిత్ రోహిత్ను దక్కించుకోవాలంటే ఆర్సీబీ కనీసం రూ.20 కోట్లు పక్కన పెట్టుకోవాలని యాష్ సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31లోపు సమర్పించాలి.
తాజావార్తలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!