IPL 2025 Auction: రోహిత్ను దక్కించుకోవాలంటే 20 కోట్లు పక్కనపెట్టుకోవాలి: అశ్విన్
- రిటైన్ జాబితాను అక్టోబర్ 31లోపు సమర్పించాలి
- అందరి కళ్లు రోహిత్ శర్మపైనే
- కోహ్లీ-రోహిత్ ఒకే జట్టులో ఉండే అవకాశం ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. దీంతో ఏ ప్రాంచైజీ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వేలంలోకి వదిలేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అందరి కళ్లు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో హిట్మ్యాన్ తన పేరును నమోదు చేసుకుంటాడని ప్రచారం జరుగుతుండడమే ఇందుకు కారణం.
ఐపీఎల్ 2024 ముందు కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి ఫ్రాంఛైజీకి, రోహిత్కు మధ్య గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబై ఇండియన్స్తో ఉన్న 13 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెప్పి.. వేరే ఫ్రాంఛైజీలో చేరాలని హిట్మ్యాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ను తీసుకోవడానికి చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తున్నాయట. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా ఉందట.
Also Read
Also Read: Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?
తాజాగా భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతుండగా.. అభిమాని నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకే జట్టులో ఉండే అవకాశం ఉందా? అని అని అడిగాడు. దీనికి అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. రోహిత్ రోహిత్ను దక్కించుకోవాలంటే ఆర్సీబీ కనీసం రూ.20 కోట్లు పక్కన పెట్టుకోవాలని యాష్ సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31లోపు సమర్పించాలి.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!