Gerogia Meloni: బుర్ఖా, నిఖాబ్పై ఇటలీ బ్యాన్.. మెలోని సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gerogia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుర్ఖా, నిఖాబ్లను నిషేధించే బిల్లును తీసుకువచ్చింది. ప్రధాని మెలోని నేతృత్వంలోని ఇటలీ పాలక పార్టీ బుధవారం దేశ పార్లమెంటులో ముస్లిం మహిళలు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను, శరీరాలను కప్పి ఉంచే బుర్ఖాలు, నిఖాబ్లను ధరించడాన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టింది.
ఇటలీలో అధికార పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పింది. మెలోని ప్రభుత్వంలోని ముగ్గురు ఎంపీలు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, దుకాణాలు, కార్యాలయాలలో ముఖం కప్పి ఉంచే దుస్తులను నిషేధించాలని పిలుపునిచ్చింది.
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
- Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
- Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
Read Also: Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఇంట్రెస్టింగ్ ఫైటింగ్.. ఢీకొట్టబోయేది ఎవరిని అంటే..!
ఈ బిల్లును రూపొందించిన వారిలో ఒకరిగా భావిస్తున్న ఎంపీ ఆండ్రియా డెల్మాస్ట్రో బుధవారం సోషల్ మీడియా వేదికగా ఈ బిల్లు గురించి సమాచారాన్ని షేర్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “మత స్వేచ్ఛ పవిత్రమైనది, కానీ దానిని బహిరంగంగా, మన రాజ్యాంగం, ఇటలీ సూత్రాల పట్ల పూర్తి గౌరవంతో ఉపయోగించుకోవాలి” అని అన్నారు. ఇస్లామిక్ ఫండమెంటలిజం వ్యాప్తి స్పష్టంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతోందని, ఈ బిల్లు మత తీవ్రవాదం, మతం ఆధారంగా ద్వేషాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఈ బిల్లు పేర్కొంది.
ఎవరైన ఉల్లంఘనలకు పాల్పడితే 300-3000 యూరోలను జరిమానాగా విధిస్తారు. మన భారతీయ కరెన్సీలో రూ. 30,959 – రూ. 3,09,588. మతపరమైన ఒత్తిడితో బలవంతపు వివాహాలకు శిక్షలను మరింత కఠినం చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు ఇటాలియన్ మసీదుల నిధులను నియంత్రించాలని కూడా ప్రతిపాదించింది. దేశ ప్రాథమిక స్వేచ్చ, భద్రతకు విరుద్ధ భావజాలనున ప్రచారం చేసే వ్యక్తలను, సంస్థల నుంచి విరాళాలు స్వీకరించినట్లు తేలితే అన్ని ముస్లిం సంస్థలపై భారీ జరిమానా విధించబడుతుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
-
Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
-
PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!