Gerogia Meloni: బుర్ఖా, నిఖాబ్పై ఇటలీ బ్యాన్.. మెలోని సంచలనం..
Gerogia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుర్ఖా, నిఖాబ్లను నిషేధించే బిల్లును తీసుకువచ్చింది. ప్రధాని మెలోని నేతృత్వంలోని ఇటలీ పాలక పార్టీ బుధవారం దేశ పార్లమెంటులో ముస్లిం మహిళలు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను, శరీరాలను కప్పి ఉంచే బుర్ఖాలు, నిఖాబ్లను ధరించడాన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టింది.
ఇటలీలో అధికార పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పింది. మెలోని ప్రభుత్వంలోని ముగ్గురు ఎంపీలు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, దుకాణాలు, కార్యాలయాలలో ముఖం కప్పి ఉంచే దుస్తులను నిషేధించాలని పిలుపునిచ్చింది.
Also Read
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్తో భారత్ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..
- US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
Read Also: Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఇంట్రెస్టింగ్ ఫైటింగ్.. ఢీకొట్టబోయేది ఎవరిని అంటే..!
ఈ బిల్లును రూపొందించిన వారిలో ఒకరిగా భావిస్తున్న ఎంపీ ఆండ్రియా డెల్మాస్ట్రో బుధవారం సోషల్ మీడియా వేదికగా ఈ బిల్లు గురించి సమాచారాన్ని షేర్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “మత స్వేచ్ఛ పవిత్రమైనది, కానీ దానిని బహిరంగంగా, మన రాజ్యాంగం, ఇటలీ సూత్రాల పట్ల పూర్తి గౌరవంతో ఉపయోగించుకోవాలి” అని అన్నారు. ఇస్లామిక్ ఫండమెంటలిజం వ్యాప్తి స్పష్టంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతోందని, ఈ బిల్లు మత తీవ్రవాదం, మతం ఆధారంగా ద్వేషాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఈ బిల్లు పేర్కొంది.
ఎవరైన ఉల్లంఘనలకు పాల్పడితే 300-3000 యూరోలను జరిమానాగా విధిస్తారు. మన భారతీయ కరెన్సీలో రూ. 30,959 – రూ. 3,09,588. మతపరమైన ఒత్తిడితో బలవంతపు వివాహాలకు శిక్షలను మరింత కఠినం చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు ఇటాలియన్ మసీదుల నిధులను నియంత్రించాలని కూడా ప్రతిపాదించింది. దేశ ప్రాథమిక స్వేచ్చ, భద్రతకు విరుద్ధ భావజాలనున ప్రచారం చేసే వ్యక్తలను, సంస్థల నుంచి విరాళాలు స్వీకరించినట్లు తేలితే అన్ని ముస్లిం సంస్థలపై భారీ జరిమానా విధించబడుతుంది.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!