Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- షేక్ హసీనా ప్రసంగంతో బంగ్లాదేశ్లో ప్రకంపనలు..
- అవామీలీగ్ను తమ పార్టీలో కలపాలని బీఎన్పీ ఎంపీ వ్యాఖ్యలు..
- బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి తన సొంత దేశం వెళ్తానని ప్రకటించింది. 2024లో హింసాత్మక తిరుగుబాటు తర్వాత ఆమె బంగ్లా నుంచి పారిపోయి భారత్ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో వేసినా, చంపేసినా కూడా తన ప్రజల వద్దు వెళ్తానని స్పష్టం చేసింది. తాను అధికారం కోసం వెళ్లడం లేదని, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం, లౌకిక విలువల కోసం వెళ్తున్నానని చెప్పారు. తన పార్టీ అవామీలీగ్పై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
షేక్ హసీనా వ్యాఖ్యలు ఆ దేశంలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తోంది. ఇదిలా ఉంటే, ఆ దేశంలో మరో కొత్త చర్చ మొదలైంది. బీఎన్పీకి చెందిన ఎంపీ నాసిర్ ఉద్దీన్ చౌధురి మాట్లాడుతూ.. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తమకు శత్రువు కాదని, మిత్రపక్షమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అవామీ లీగ్ బీఎన్పీలో విలీనం కావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 1971 విమోచన యుద్ధంలో బీఎన్పీ, అవామీలీగ్ కలిసి పోరాడాయని గుర్తు చేశారు. అవామీలీగ్ను శత్రువుగా చూడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో రెండు పార్టీల విలీనం కూడా సాధ్యమేనని వ్యాఖ్యానించారు.
Also Read
- Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
అయితే, నాసిర్ ఉద్దీన్ వ్యాఖ్యలపై బీఎన్పీ పార్టీ మద్దతు ఇవ్వలేదు. మరోవైపు షేక్ హసీనాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీఎన్పీ సీనియర్ నేత రుహుల్ కబీర్ రిజ్వీ మాట్లాడుతూ.. జూలై ఉద్యమంలో మరణించిన వారిని అవమానించేలా భారత్ ఈ సమావేశాన్ని నిర్వహించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. భారత భూభాగాన్ని ఉపయోగించి తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం జరిగిందని విమర్శించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు హఫీజ్ అహ్మద్ హసీనాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆమె తిరిగి రావచ్చు, అయితే ప్రజల మధ్యే సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!