Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- షేక్ హసీనా ప్రసంగంతో బంగ్లాదేశ్లో ప్రకంపనలు..
- అవామీలీగ్ను తమ పార్టీలో కలపాలని బీఎన్పీ ఎంపీ వ్యాఖ్యలు..
- బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి తన సొంత దేశం వెళ్తానని ప్రకటించింది. 2024లో హింసాత్మక తిరుగుబాటు తర్వాత ఆమె బంగ్లా నుంచి పారిపోయి భారత్ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో వేసినా, చంపేసినా కూడా తన ప్రజల వద్దు వెళ్తానని స్పష్టం చేసింది. తాను అధికారం కోసం వెళ్లడం లేదని, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం, లౌకిక విలువల కోసం వెళ్తున్నానని చెప్పారు. తన పార్టీ అవామీలీగ్పై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
షేక్ హసీనా వ్యాఖ్యలు ఆ దేశంలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తోంది. ఇదిలా ఉంటే, ఆ దేశంలో మరో కొత్త చర్చ మొదలైంది. బీఎన్పీకి చెందిన ఎంపీ నాసిర్ ఉద్దీన్ చౌధురి మాట్లాడుతూ.. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తమకు శత్రువు కాదని, మిత్రపక్షమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అవామీ లీగ్ బీఎన్పీలో విలీనం కావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 1971 విమోచన యుద్ధంలో బీఎన్పీ, అవామీలీగ్ కలిసి పోరాడాయని గుర్తు చేశారు. అవామీలీగ్ను శత్రువుగా చూడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో రెండు పార్టీల విలీనం కూడా సాధ్యమేనని వ్యాఖ్యానించారు.
Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
అయితే, నాసిర్ ఉద్దీన్ వ్యాఖ్యలపై బీఎన్పీ పార్టీ మద్దతు ఇవ్వలేదు. మరోవైపు షేక్ హసీనాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీఎన్పీ సీనియర్ నేత రుహుల్ కబీర్ రిజ్వీ మాట్లాడుతూ.. జూలై ఉద్యమంలో మరణించిన వారిని అవమానించేలా భారత్ ఈ సమావేశాన్ని నిర్వహించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. భారత భూభాగాన్ని ఉపయోగించి తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం జరిగిందని విమర్శించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు హఫీజ్ అహ్మద్ హసీనాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆమె తిరిగి రావచ్చు, అయితే ప్రజల మధ్యే సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!