Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- షేక్ హసీనా ప్రసంగంతో బంగ్లాదేశ్లో ప్రకంపనలు..
- అవామీలీగ్ను తమ పార్టీలో కలపాలని బీఎన్పీ ఎంపీ వ్యాఖ్యలు..
- బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి తన సొంత దేశం వెళ్తానని ప్రకటించింది. 2024లో హింసాత్మక తిరుగుబాటు తర్వాత ఆమె బంగ్లా నుంచి పారిపోయి భారత్ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో వేసినా, చంపేసినా కూడా తన ప్రజల వద్దు వెళ్తానని స్పష్టం చేసింది. తాను అధికారం కోసం వెళ్లడం లేదని, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం, లౌకిక విలువల కోసం వెళ్తున్నానని చెప్పారు. తన పార్టీ అవామీలీగ్పై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
షేక్ హసీనా వ్యాఖ్యలు ఆ దేశంలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తోంది. ఇదిలా ఉంటే, ఆ దేశంలో మరో కొత్త చర్చ మొదలైంది. బీఎన్పీకి చెందిన ఎంపీ నాసిర్ ఉద్దీన్ చౌధురి మాట్లాడుతూ.. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తమకు శత్రువు కాదని, మిత్రపక్షమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అవామీ లీగ్ బీఎన్పీలో విలీనం కావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 1971 విమోచన యుద్ధంలో బీఎన్పీ, అవామీలీగ్ కలిసి పోరాడాయని గుర్తు చేశారు. అవామీలీగ్ను శత్రువుగా చూడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో రెండు పార్టీల విలీనం కూడా సాధ్యమేనని వ్యాఖ్యానించారు.
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
- Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
- Pakistan: ఉద్రిక్తతల వేళ టర్కీ, సౌదీ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
అయితే, నాసిర్ ఉద్దీన్ వ్యాఖ్యలపై బీఎన్పీ పార్టీ మద్దతు ఇవ్వలేదు. మరోవైపు షేక్ హసీనాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీఎన్పీ సీనియర్ నేత రుహుల్ కబీర్ రిజ్వీ మాట్లాడుతూ.. జూలై ఉద్యమంలో మరణించిన వారిని అవమానించేలా భారత్ ఈ సమావేశాన్ని నిర్వహించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. భారత భూభాగాన్ని ఉపయోగించి తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం జరిగిందని విమర్శించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు హఫీజ్ అహ్మద్ హసీనాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆమె తిరిగి రావచ్చు, అయితే ప్రజల మధ్యే సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్కు కొత్త మలుపు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!