Israeli Airstrikes Beirut: బీరుట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..
- మరోసారి బీరుట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..
- హెజ్బొల్లా ముష్కరులు ఆ ప్రాంతాల్లో ఉన్నారనే సమాచారంతో దాడి చేశాం: ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israeli Airstrikes Beirut: లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. లెబనాన్లోని ఏకైక అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీపంలోనూ దాడులకు పాల్పడింది. హెజ్బొల్లా ముష్కరులు ఆయా ప్రాంతాల్లో నక్కి ఉన్నారంటూ తమకు సమాచారం అందిందని ఇజ్రాయెల్ సైన్యం చెప్పుకొచ్చింది. ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన తర్వాతే దాడులకు దిగినట్లు పేర్కొనింది. అయితే, ఈ దాడుల నష్ట తీవ్రత ఇంకా వెల్లడించలేదు. మరోవైపు- ఇజ్రాయెల్ దూకుడును తగ్గించుకుంటే.. కాల్పుల విరమణపై ఆ దేశంతో చర్చలు జరిపేందుకు తాము రెడీగా ఉన్నట్లు హెజ్బొల్లా నేత నయీం ఖాసిం బుధవారం చెప్పుకొచ్చారు.
Read Also: SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
ఇక, గాజాలో తమ సైనిక ఆపరేషన్ను మరింత విస్తృతం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా వాయవ్య గాజా పట్టణమైన బీట్ లహియాలో భూతల దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి యుద్ధం స్టార్టింగ్ లోనే బాంబు దాడులతో ఈ పట్టణంలో ఇజ్రాయెల్ నానా బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం హమాస్ ముష్కరులు మళ్లీ అక్కడ తలదాచుకుంటున్నట్లు సమాచారం అందింది.. అందుకే భూతల దాడులకు దిగుతున్నామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
Read Also: CM Revanth Reddy: నేడు సీఎం పుట్టినరోజు.. యాదాద్రిని దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి.
కాగా, అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి 25 ఎఫ్-15 యుద్ధ విమానాలను కొనుగోలుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. దాడులకు పాల్పడే పాలస్తీనా ప్రజల కుటుంబ సభ్యులను తమ దేశం నుంచి బహిష్కరించేలా కొత్త చట్టాన్ని గురువారం నాడు ఇజ్రాయెల్ తీసుకొచ్చింది. సంబంధిత బిల్లును ఆ దేశ పార్లమెంటులో 61-41 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఇజ్రాయెల్తో పాటు తూర్పు జెరూసలెంలోని పాలస్తీనా పౌరులకు ఈ చట్టం వర్తించనుంది. బహిష్కరణ వేటు పడ్డవారిని గాజా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లగొట్టనున్నారు.
తాజావార్తలు
-
NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
-
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
-
Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!