Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం.. కొడుకు పెళ్లి వాయిదా వేసిన ప్రధాని..
- ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ముదిరిన ఘర్షణ..
- మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాలు..
- యుద్ధ నేపథ్యంలో కొడుకు పెళ్లి వాయిదా వేసిన ఇజ్రాయిల్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయిల్ దాడులు చేయడంతో పాటు ఆ దేశానికి చెందిన టాప్ మిలిటరీ జనరల్స్ని ఎలిమినేట్ చేసింది. ఇదే కాకుండా ఇరన్ అణు శాస్త్రవేత్తలను చంపేసింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సంఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు, ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయిల్ టెల్ అవీవ్, జెరూసలెం, హైఫా నగరాలే లక్ష్యంగా వందలాది మిస్సైళ్లను ప్రయోగించింది.
Read Also: Yanamala Rama Krishnudu: గతంలో నిద్రపోయారా..? సోకాల్డ్ సంపాదకులపై యనమల ఫైర్..!
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
రెండు దేశాల మధ్య ఘర్షణ తీవ్రంగా మారడం, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తన కుమారుడి పెళ్లిని వాయిదా వేస్తుకున్నారు. నెతన్యాహూ కుమారుడు అవ్నర్ నెతన్యాహూ సోమవారం తన భాగస్వామి అమిత్ యార్దేనిని వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే, ఇజ్రాయిల్ బందీలు ఇప్పటికీ గాజాలో ఉండగా, నెతన్యాహూ కుటుంబం వేడుకలు జరుపుకోవడంపై కొందరు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ వివాహం వివాదానికి దారి తీసింది. టెల్ అవీవ్కు ఉత్తరాన ఉన్న కిబ్బట్జ్ యాకుమ్లోని ఉన్నత స్థాయి రోనిట్స్ ఫామ్ ఈవెంట్ హాల్లో వివాహ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారని ముందుగా అనుకున్నారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే కుమారుడి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, నెతన్యాహు కుటుంబం మెగా వేడుకలకు సిద్ధమవుతుండగా, ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్పై పెద్ద దాడిని ప్రారంభించింది, అణు స్థావరాలు, సైనిక సౌకర్యాలు, క్షిపణి స్థావరాలు మరియు ఇస్లామిక్ రిపబ్లిక్లోని సీనియర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతీకారంగా జరిపిన దాడుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు మరణించారని, 180 మంది గాయపడ్డారని ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!