ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక నేతలు హతమయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.
ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిలో తిష్ట వేసిన 16 ఇరానియన్ మైన్-లేయింగ్ బోట్లను అమెరికా ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికా విడుదల చేసింది.
Israel – Iran War: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.. కానీ, రష్యాలో మాత్రం స్టాక్ మార్కెట్ గణనీయమైన ర్యాలీని నమోదు చేస్తోంది. యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర చమురు మార్గాలలో ఒకటైన Strait of Hormuzలో ఉద్రిక్తతలు…
Israel-Iran war: ఇరాన్లో కీలక వ్యక్తులు లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి సహా పలువురు నిఘా అధికారులు మృతి చెందినట్లు సమాచారం. Israel Defense Forces (IDF) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, “ఆపరేషన్ రోరింగ్ లయన్”లో భాగంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు పేర్కొంది. ఖచ్చితమైన…
Breaking News: పశ్చిమాసియా పరిణామాలు, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం రాత్రి అత్యున్నత సమావేశం జరగబోతోంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశం కానుంది. తమిళనాడు పర్యటన తర్వాత ఆదివారం రాత్రి మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత సేవాతీర్థ్లో ఈ సమావేశంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయుల రక్షణ గురించి చర్చించే అవకాశం ఉంది.
Israel-Iran War: మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తీవ్రంగా మారింది. ఈ ఘర్షణ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. యూఎస్ మిత్రదేశాలైన గల్ఫ్ లోని ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఇరాక్, కువైట్ వంటి దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైల్ అటాక్స్ చేస్తోంది.
US-Iran Tension: మిడిల్ ఈస్ట్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయిల్లోని అమెరికా రాయబారి మైక్ హకబీ శుక్రవారం రాయబార కార్యాలయ సిబ్బందితో మాట్లాడుతూ.. ‘‘మీరు ఇజ్రాయిల్ వదిలి వెళ్లాలనుకుంటే ఈరోజే వదిలి వెళ్లండి’’ అని అన్నారు.
US Iran Tensions: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మళ్లీ బంకర్లో దాక్కున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అమెరికా నుంచి హత్య బెదిరింపులు వచ్చిన తర్వాత ఖమేనీ అండర్గ్రౌండ్లోకి వెళ్లినట్లు సమాచారం. గత ఏడు నెలల్లో ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడం ఇది రెండోసారి. గతంలో జూన్ 2025లో ఖమేనీ 21 రోజుల పాటు బంకర్లో తలదాచుకున్నాడు. ట్రంప్ భయంతోనే ఖమేనీ అండర్గ్రౌండ్కు షిఫ్ట్ అయ్యాడా, ఇరాన్లో అసలు ఏం జరుగుతుంది.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.…
Israel Iran Conflict: ఇటీవల ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇరాన్ అణు కార్యక్రమాలపై వైమానిక దాడులు నిర్వహించింది. అణు ఫెసిలిటీలపై దాడులతో పాటు అణు శాస్త్రవేత్తలను, సైనిక కమాండర్లను హతమార్చింది. దాదాపుగా అత్యున్నత స్థాయిలో ఉన్న 60 మందిని టార్గెటెడ్ దాడుల్లో చంపేసింది.
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారిగా ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. సంఘర్షణ తర్వాత తన తొలి బహిరంగ ప్రసంగంలో ఖమేనీ గురువారం మాట్లాడుతూ.. ఇజ్రాయిల్పై తాము విజయం సాధించామని, ఇజ్రాయిల్ని కాపాడాలని అండగా వచ్చిన అమెరికా ముఖంపై చెంప దెబ్బ కొట్టామని అన్నారు. ఇరాన్ అణు స్థావరాలకు పెద్దగా నష్టం జరగలేదని, అమెరికా పెద్దగా ఏం సాధించలేకపోయిందని చెప్పారు.