ఇరాన్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా నేలరాలిపోతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దగ్గర నుంచి ఆయన కుడి భుజం, ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ వరకు టాప్ మోస్ట్ లీడర్లంతా ప్రాణాలు కోల్పోయారు.
Iran War: మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అయితే, ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ ముందుగానే చెప్పనట్లు తెలుస్తోంది. మొసాద్ ముందుగానే ఇజ్రాయిల్ ప్రభుత్వానికి, ప్రధాని నెతన్యాహూకు చెప్పినట్లు సమాచారం. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మొసాద్ అధిపతి డేవిడ్ బార్నియా.. ఇరాన్లో పాలనా మార్పు సాధ్యమేనని కానీ దానికి సమయం పడుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ప్రక్రియ, యుద్ధం వారాలు నెలలు…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వంత డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ను ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి బాధ్యుడిగా చూపించారు. టెన్నెస్సీలోని మెంఫిస్లో జరిగిన “Safe Task Force” రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హెగ్సెత్ అక్కడే పక్కన కూర్చుని ఉన్నారు. ఇజ్రాయెల్ సహకారంతో, ట్రంప్ ఇరాన్ సర్వోన్నత నాయకుడితో సహా పలువురు ప్రముఖ ఇరాన్ నాయకులను హతమార్చారు. ఇరాన్పై దాడి చేయమని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ను ప్రేరేపించారని గతంలో ఆరోపణలు…
Israel-Iran War: ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడి ఇరాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ దాడికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. రాబోయే కొద్ది గంటల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్లోని ఐదు ఇంధన సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తేల్చి చెప్పింది.…
Iran Execution: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొస్సాద్’ కోసం పని చేస్తున్నాడనే ఆరోపణలతో కురుష్ కీవాని అనే వ్యక్తికి ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని విదేశీ శక్తులకు చేరవేసినట్లు సాక్ష్యాధారాలు లభించడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. READ ALSO: North Korean Elections: 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపు.. ఎవరో…
ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలపై స్పందిస్తూ.. నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో విడుదల చేసి.. ఆ వార్తలను నవ్వుతూ కొట్టిపారేశారు. కాఫీ తాగుతూ కౌంటర్.. నెతన్యాహు ఒక కేఫ్ వద్ద కాఫీ ఆర్డర్ చేస్తూ వీడియోలో కనిపించారు. ‘నేను చనిపోయాను… కాఫీ కోసం’ అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ‘నా ప్రజల కోసం నేను ప్రాణాలు ఇస్తున్నాను,…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక నేతలు హతమయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.
ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిలో తిష్ట వేసిన 16 ఇరానియన్ మైన్-లేయింగ్ బోట్లను అమెరికా ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికా విడుదల చేసింది.
Israel – Iran War: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.. కానీ, రష్యాలో మాత్రం స్టాక్ మార్కెట్ గణనీయమైన ర్యాలీని నమోదు చేస్తోంది. యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర చమురు మార్గాలలో ఒకటైన Strait of Hormuzలో ఉద్రిక్తతలు…