పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. డ్రోన్తో దాడి చేయడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. దీంతో భారీగా పొగలు ఎగసిపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
BV Raghavulu: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరి దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. చర్చలు జరుపుతున్నామని చెబుతూ అకస్మాత్తుగా దాడులు చేయడం అనైతికమని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదని, మారణకాండ కొనసాగుతుందని…
Iran-Israel War: ఇజ్రాయెల్ దాడుల్లో గాంధీ ఆస్పత్రి ధ్వంసమైంది.. ఇరాన్ అధికారులు పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. గాంధీ ఆస్పత్రి దాడిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదానోమ్ ఘెబ్రేయెసస్ స్పందించారు.. ఆస్పత్రుల్లో దాడులు ఆందోళనకరమని డైరెక్టర్ తెలిపారు.. మరో మూడు ఇతర హాస్పిటల్స్పై ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది.. గతంలోనూ టెహ్రాన్ లోని గాంధీ ఆస్పత్రిపైనా దాడి జరిపినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. “తహ్రాన్లో గాంధీ హాస్పిటల్ పై బంబింగ్ వార్తలు…
పశ్చిమాసియాలో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ , అమెరికా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఒక “నైతికతమానవత్వం లేని క్రూరమైన హత్య” (Cynical Murder) గా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కి, ఒక దేశ అత్యున్నత నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం భయంకరమైన పరిణామాలకు…
Ali Khamenei: ఇజ్రాయెల్ – అమెరికా సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాదనను బలపరుస్తూ, సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన పోస్ట్లో ట్రంప్.. ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకరిగా అభివర్ణించారు. ఆయన మరణం ఇరాన్ ప్రజలకే కాకుండా, ఆయన హయాంలో ప్రాణాలు…
Iran vs America: ఇరాన్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశంపై యూఎస్ సైనిక జోక్యానికి దిగితే, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వార్నాంగ్ ఇచ్చారు.
Iran Nuclear Program: టెహ్రాన్లోని అణుశక్తి సంస్థను ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ దేశ అణు శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెహ్రాన్ తన అణు సౌకర్యాలను పునర్నిర్మించుకుంటుందని, ఇంకా ఎక్కువ శక్తితో వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. “ఎన్ని భవనాలు, కర్మాగారాలు ధ్వంసమైనా, మేము వాటిని పునర్నిర్మిస్తాము, ఈసారి మరింత బలంగా ఉంటాము” అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదు,…
US Strike: అమెరికా ఇరాన్పై దాడులు నిర్వహించిన కొన్ని రోజులు తర్వాత, తమ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్లోని అత్యంత కీలకమైన, అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ దెబ్బతిన్నట్లు శాటిలైట్ ఇమేజ్లు చూపిస్తున్నాయి. ఈ వారాంతంలో అమెరికా దాడుల్లో తమ దేశ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై బుధవారం అన్నారు.
Hands off Iran: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ వార్ లోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతలతో యూఎస్ ప్రధాన నగరాల్లో ఇరాన్కి మద్దతుగా నిరసన ప్రదర్శనలు జరుగుతుండడం ఇప్పుడు తీవ చర్చనీయాంశంగా మారింది.
Padma Shri Garikapati Narasimha Rao: మహా సహస్రావధాని, ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. ఆయన అవధానాలు వినే ఉంటారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఇచ్చే సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువత గరికపాటి సందేశాలను బాగా ఇష్టపడతారు. ప్రస్తుత సమాజానికి తగ్గట్టు మాట్లాడటం, ఏదేని విషయాన్ని కుండ బద్ధుల గొట్టినట్లు వివరించడం యువతను కట్టి పడేస్తుంది.