Israel Iran War: ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ శుక్రవారం ‘‘ ది రైజింగ్ లయన్’’ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న అణు కార్యక్రమ కేంద్రాలు, ఇరాన్ టాప్ మిలిటరీ జనరల్స్, అణు శాస్త్రవేత్తలపై దాడులు నిర్వహించింది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 80 మంది వరకు మరణించనట్లు ఇరాన్ ధ్రువీకరించింది.
Israel Iran War: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యక్రమాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. టాప్ మిలిటరీ జనరల్స్, అణు శాస్త్రవేత్తలు టార్గెట్గా ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు దారుణంగా దెబ్బతినడంతో పాటు కీలకమైన అధికారులు మరణించారు. ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై ప్రతీకార దాడులు చేస్తోంది. వందలాది మిస్సైళ్లతో ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెంతో పాటు కీలక నగరాలైన టెల్ అవీవ్,…
Israel Iran Conflict: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ లోని అతిపెద్ద నగరమైన టెల్ అవీవ్ని ఇరాన్ క్షిపణులతో టార్గెట్ చేసింది. అయితే, ఇప్పుడు ఇజ్రాయిల్ పొరపాటున చేసిన పనికి భారతదేశానికి ‘‘క్షమాపణలు’’ చెప్పింది. భారతదేశ పటాన్ని ఇజ్రాయిల్ తప్పుగా చూపించింది. జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్లో భాగంగా, ఈశాన్య రాష్ట్రాలు నేపాల్లో భాగంగా చూపించింది.
Israel Iran Conflict: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండు దేశాలు కూడా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము ఇజ్రాయిల్ ఇరాన్ అణు కేంద్రాలను, కీలక శాస్త్రవేత్తలు, అధికారులను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా శనివారం, ఇజ్రాయిల్ అతిపెద్ద నగరం టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. టెల్ అవీవ్తో పాటు రాజధాని జెరూసలెంలో కూడా పేలుళ్లు జరిగాయి. మరోవైపు, 24 గంటల్లోనే ఇజ్రాయిల్ మరోసారి ఇరాన్పై భీకర దాడి…
Israel Strikes: ఇజ్రాయిల్ ఇరాన్పై విరుచుకుపడుతోంది. 24 గంటల్లో మరోసారి క్షిపణులతో దాడి చేసింది. రాజధాని టెహ్రాన్తో సహా పలు ప్రాంతాలపై ఎటాక్ చేసింది. ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలతో సహా 200కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇస్ఫహాన్ అణు కేంద్రంపై దాడులు చేసినట్లు తెలిపింది.
Jaishankar : ఇరాన్ బలగాలు ఒమన్ గల్ఫ్లోని హార్ముజ్ జలసంధి దగ్గర ఏప్రిల్ 13న ఓడను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్కు చెందిన ఈ కార్గో షిప్ 'ఎంఎస్సి ఏరీస్'లో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు.